IT filing: ఏడాది గడిచినా కొత్త e-filing ఐటీ పోర్టల్‌ లో తొలగని సాంకేతిక సమస్యలు, మరోసారి సేవల్లో అంతరాయం..

Published : Jun 07, 2022, 07:25 PM IST
IT filing: ఏడాది గడిచినా కొత్త  e-filing  ఐటీ పోర్టల్‌ లో తొలగని సాంకేతిక సమస్యలు, మరోసారి సేవల్లో అంతరాయం..

సారాంశం

ఆదాయపు పన్ను రిటర్న్‌లు సమర్పించే కొత్త పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు ఇంకా తొలగిపోలేదు. ఈ ఫైలింగ్ పోర్టల్ లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు ఆదాయపు పన్ను శాఖ తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇదిలా ఉంటే వినియోగదారులు ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌ను ఉపయోగిస్తున్నప్పుడు తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి.

ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోని 'సెర్చ్' ఆప్షన్‌లో ఎదురవుతున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆ శాఖ సర్వీస్ ప్రొవైడరర్ అయిన ఇన్ఫోసిస్‌ను ఆదేశించింది. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆ శాఖ చెబుతోంది.

మనీకంట్రోల్ పోర్టల్ ద్వారా తెలిసిన వార్తల ప్రకారం, ఈ రోజు కూడా పోర్టల్‌లో సాంకేతిక సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయని ఆదాయపు పన్ను శాఖ మంగళవారం తెలిపింది. పోర్టల్‌ను ప్రారంభించి మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇన్ఫోసిస్ ఈ సమస్యను తొలి ప్రాధాన్యతా ప్రాతిపదికన  పరిష్కరిస్తున్నట్లు ఆ శాఖ తెలిపింది.

డిపార్ట్‌మెంట్ ట్విట్టర్‌లో ఏమి రాసింది
వార్తల ప్రకారం, ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లోని 'సెర్చ్' ఎంపికలో సమస్య మా దృష్టికి వచ్చిందని ఆదాయపు పన్ను శాఖ ట్విట్టర్‌లో రాసింది. ఇన్ఫోసిస్‌ను దర్యాప్తు చేయాలని ఆదాయపు పన్ను శాఖ ఆదేశించింది. ప్రాధాన్యతా ప్రాతిపదికన సరిచేస్తున్నట్లు శాఖ తెలిపింది. పోర్టల్‌లోని డేటాలో ఎలాంటి ఉల్లంఘన జరగలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు దీని గురించి తెలిపారు. ఏ రకమైన డేటా ఉల్లంఘన లేదని తెలిపింది.  కాగా ఆదాయపు పన్ను శాఖ కొత్త పోర్టల్‌ గత ఏడాది జూన్‌ 7న ప్రారంభమైనప్పటి, నుంచి పలు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నట్లు పన్ను చెల్లింపుదారులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. ఈ పోర్టల్‌ను అభివృద్ధిచేసిన ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌తో ఆర్థిక శాఖ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపడంతో చాలావరకూ సమస్యలు పరిష్కారమయ్యాయని సీబీడీటీ తెలిపింది.

గతేడాది గడువు పొడిగించాల్సి వచ్చింది
కొత్త ఆదాయపు పన్ను పోర్టల్‌ను ప్రారంభించి మంగళవారం మొదటి వార్షికోత్సవం పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే కొత్త ఇ-ఫైలింగ్ పోర్టల్ www.incometax.gov.in 7 జూన్ 2021న ప్రారంభించింది.  గత సంవత్సరం కూడా, ఇటువంటి అనేక సమస్యలను వినియోగదారులు దృష్టిలోకి తెచ్చారు. ముఖ్యంగా పోర్టల్ సరిగా పనిచేయకపోవడం, రిటర్న్‌లను దాఖలు చేయడంలో సమస్యలు తలెత్తాయి. దీని తరువాత, పన్ను చెల్లింపుదారులు పన్ను రిటర్న్‌లు, ఇతర ఫారమ్‌లను దాఖలు చేయడానికి ప్రభుత్వం అదనపు సమయం ఇచ్చింది. కొత్త ఆదాయపు పన్ను పోర్టల్‌ను రూపొందించే బాధ్యతను 2019లో దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Business Ideas: చింత గింజ‌ల‌తో ల‌క్షాధికారి కావొచ్చు.. జీవితాన్ని మార్చే బిజినెస్ ఐడియా
నిజంగానే పాత‌ సిమ్ కార్డుల‌ నుంచి బంగారం వ‌స్తుందా.? గ్రామ్ గోల్డ్‌కి ఎన్ని సిమ్ కార్డులు కావాలంటే