GST: అక్టోబర్ నెలలో రికార్డు స్థాయి జీఎస్టీ వసూళ్లు...1.72 లక్షల కోట్లు దాటిని జీఎస్టీ వసూళ్లు..

By Krishna AdithyaFirst Published Nov 1, 2023, 5:47 PM IST
Highlights

పండుగల సీజన్ సహాయంతో, అక్టోబర్ నెలలో GST వసూళ్లు అత్యధిక నెలవారీ వసూళ్లలో రెండవ స్థానంలో నిలిచాయి. ఆర్థిక శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం అక్టోబర్ నెలలో జీఎస్టీ ద్వారా ప్రభుత్వ ఖజానాలో రూ.1.72 లక్షల కోట్లు జమ అయ్యాయి.

GST పన్ను వసూళ్లు అక్టోబర్‌లో వార్షిక ప్రాతిపదికన 13 శాతం పెరిగి రూ.1.72 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు ఇది రెండో అత్యధిక జీఎస్టీ వసూళ్లు కావడం విశేషం. ఏప్రిల్ 2023లో అత్యధిక GST వసూళ్లు రూ. 1.87 లక్షల కోట్లు నమోదయ్యాయి. సెప్టెంబర్ 2023లో GST వసూళ్లు రూ. 1.63 లక్షల కోట్లు. ప్రతినెలా GST వసూళ్లు పెరుగుతున్నాయి.

విడుదలైన గణాంకాల ప్రకారం గత నెలలో జీఎస్టీ ద్వారా మొత్తం రూ.1,72,003 కోట్లు వసూలయ్యాయి. ఇందులో రూ.30,062 కోట్లు సీజీఎస్టీగా, రూ.38,171 కోట్లు ఎస్జీఎస్టీగా, రూ.91,315 కోట్లు ఐజీఎస్టీగా జమ అయ్యాయి. వస్తువుల దిగుమతిపై ఐజీఎస్టీలో రూ.42,127 కోట్లు వసూలయ్యాయి. ఇది కాకుండా రూ.12,456 కోట్లు సెస్‌గా వసూలు చేశారు. డెరివేటివ్‌లతో సహా దేశీయ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయం గతేడాదితో పోలిస్తే 13 శాతం పెరిగింది.

సగటు జీఎస్టీ వసూళ్లు రూ.1.66 లక్షల కోట్లకు చేరాయి 
2023-24 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 11 శాతం పెరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది 1.66 లక్షల కోట్లు. 

ఏప్రిల్-1,87,035 లక్షల కోట్లు 
మే - రూ. 1,57,090 లక్షల కోట్లు 
జూన్- రూ.1,61,497 లక్షల కోట్లు 
జూలై- రూ. 1,65,105 లక్షల కోట్లు 
ఆగస్టు- 1,59,069 లక్షల కోట్లు
సెప్టెంబర్ - రూ. 1,62,712 లక్షల కోట్లు 
అక్టోబర్ - రూ. 1,72,003 లక్షల కోట్లు 

ఆర్థిక లోటు గణాంకాలను ప్రభుత్వం నిన్న విడుదల చేసింది. ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో దేశ ఆర్థిక లోటు రూ.7.02 లక్షల కోట్లుగా ఉంది. ఇది మొత్తం ఆర్థిక సంవత్సరం లక్ష్యంలో 39.3 శాతంగా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్య లోటు లక్ష్యాన్ని రూ.17.87 లక్షల కోట్లుగా ప్రభుత్వం నిర్దేశించింది. ఏప్రిల్-సెప్టెంబర్ 2022కి ఆర్థిక లోటు 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో 37.3 శాతంగా ఉంది. ఏప్రిల్-సెప్టెంబర్ 2023 గురించి మాట్లాడితే, మొత్తం ప్రభుత్వ వసూళ్లు 17.7 శాతం పెరిగాయి. కార్పొరేట్ పన్ను వసూళ్లు 20.2 శాతం పెరిగాయి. అదే సమయంలో వార్షిక ప్రాతిపదికన ఆదాయపు పన్నులు 31.1 శాతం పెరిగాయి.

click me!