అక్టోబర్ 1వ తేదీన మోదీ ప్రభుత్వానికి గుడ్ న్యూస్...కొత్త రికార్డుల దిశగా సెప్టెంబర్ నెల జీఎస్టీ వసూళ్లు..

By Krishna AdithyaFirst Published Oct 1, 2023, 6:11 PM IST
Highlights

అక్టోబర్ మొదటి తేదీన కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి శుభవార్త వచ్చింది.  ఆర్థిక మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 2023 నెలకు సంబంధించిన GST కలెక్షన్  గణాంకాలను ఆదివారం నాడు విడుదల చేసింది. దీని ప్రకారం, దేశంలో జీఎస్టీ వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 10 శాతం పెరిగి రూ.1.62 లక్షల కోట్లకు చేరాయి. 

సెప్టెంబర్ 2023 నెలలో కేంద్ర ప్రభుత్వ స్థూల GST వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 10 శాతం పెరిగి రూ.1,62,712 కోట్లకు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు రూ. 1.6 లక్షల కోట్లను దాటడం ఇది నాలుగో సారి కావడం విశేషం.  ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1,62,712 కోట్లు కాగా ఇందులో సెంట్రల్ జీఎస్టీ అంటే సీజీఎస్టీ రూ.29,818 కోట్లు, స్టేట్ జీఎస్టీ అంటే ఎస్జీఎస్టీ. రూ.37,657 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ అంటే ఐజీఎస్టీ 83,623 కోట్లు (వస్తువుల దిగుమతిపై జమ చేసిన రూ. 41,145 కోట్లతో సహా), సెస్ రూ. 11,613 కోట్లు (వస్తువుల దిగుమతిపై జమ చేసిన రూ. 881 కోట్లతో కలిపి) వసూలు అయ్యాయి.

సెప్టెంబరు 2023లో జిఎస్‌టి వసూళ్లు గత ఏడాది ఇదే నెలలో రూ. 1.47 లక్షల కోట్ల కంటే 10 శాతం ఎక్కువ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. "సమీక్షిస్తున్న నెలలో, దేశీయ లావాదేవీల నుండి (సేవల దిగుమతితో సహా) ఆదాయం వార్షిక ప్రాతిపదికన 14 శాతం ఎక్కువ" అని ప్రకటన పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ. 1.60 లక్షల కోట్లను దాటడం ఇది నాలుగోసారి. డేటా ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో జీఎస్టీ స్థూల వసూళ్లు రూ.9,92,508 కోట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 11 శాతం ఎక్కువ. 

ఆగస్టు నెలలో వసూళ్లు ఇవే..
అంతకు ముందు నెలలో అంటే ఆగస్టు 2023లో ప్రభుత్వానికి 1,59,069 కోట్ల రూపాయల స్థూల GST వసూళ్లు వచ్చాయి.  వార్షిక ప్రాతిపదికన 11 శాతం వృద్ధి నమోదైంది. 

ఏప్రిల్‌లో అత్యధిక వసూళ్లు జరిగాయి.

దేశంలో జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 2023లో అత్యధిక జీఎస్టీ వసూళ్లు జరిగాయి. ఈ సంఖ్య రికార్డు స్థాయి రూ.1.87 లక్షల కోట్లకు చేరుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో సగటు నెలవారీ జీఎస్టీ వసూళ్లు రూ. 1.10 లక్షల కోట్లు కాగా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో సగటు వసూళ్లు రూ. 1.51 లక్షల కోట్లు కాగా, 2023-24 మొదటి త్రైమాసికంలో సగటు వసూళ్లు రూ. 1.69 లక్షల కోట్లు. 

GST 2017లో అమలు చేయబడింది.
పాత పరోక్ష పన్ను విధానం స్థానంలో జూలై 1, 2017న దేశవ్యాప్తంగా GST అమలు చేయబడింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో జరిగిన అతిపెద్ద పన్ను సంస్కరణగా దీన్ని పరిగణిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకారం, ఆరేళ్ల క్రితం అమలు చేసిన జీఎస్టీ దేశ ప్రజలపై పన్ను భారాన్ని తగ్గించడంలో దోహదపడింది.

click me!