
గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్-రష్యా యుద్ధాల కారణంగా పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు తగ్గుముఖం పడుతోంది. ధరలు ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం ఆగవు. ప్రస్తుతం దేశంలో బంగారం, వెండి ధరలు ధరలు దూసుకుపోతున్నాయి. తాజాగా బుధవారం (మార్చి16, 2022)న దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇక దేశీయంగా 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా 600ల వరకు దిగివచ్చింది. ఇక వెండి ధర కూడా భారీగానే దిగి వచ్చింది. ఇక దేశీయంగా కిలో వెండిపై రూ.1000 పైగా తగ్గుముఖం పట్టింది.
అంతర్జాతీయంగా బంగారం, వెండి డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం డిమాండ్, వడ్డీ రేట్లు, వివిధ దేశాల మధ్య భౌగోళిక పరిస్థితులు, కరోనా మహమ్మారి, డాలర్ విలువ వంటివి ప్రభావం చూపిస్తుండటం వల్ల బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,600 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,930గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,600 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.51,930 వద్ద ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,190 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,570గా ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930గా ఉంది. తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..47,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,930గా ఉంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
వెండి ధరలు
వెండి ధరల విషయానికొస్తే దేశీయంగా కిలో వెండి ధరపై రూ.1000కిపైగా తగ్గుముఖం పట్టింది. తాజాగా ఢిల్లీలో కిలో వెండి ధర రూ.69,000 ఉండగా, ముంబైలో రూ.69,000గా ఉంది. ఇక చెన్నైలో కిలో బంగారం ధర రూ.72,800 ఉండగా, కోల్కతాలో రూ.69,000గా ఉంది. బెంగళూరులో కిలో బంగారం ధర రూ.72,800 ఉండగా, కేరళలో రూ.72,800గా ఉంది. హైదరాబాద్లో కిలో బంగారం ధర రూ.72,800 ఉండగా, విజయవాడలో రూ.72,800 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.