
పసిడి రేటు నేడు స్థిరంగానే కొనసాగింది. బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. బంగారం, వెండి కొనుగోలుదారులకు ఇది కాస్త ఊరట కలిగించే అంశమనే చెప్పుకోవాలి. నిన్న బంగారం, వెండి ధరలు నేల చూపులు చూసిన విషయం తెలిసిందే. జూన్ 20న హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర రూ. 51,980 వద్ద ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి ఈ రేటు వర్తిస్తుంది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 47,650 వద్ద ఉంది. అదేసమయంలో వెండి రేటు విషయానికి వస్తే కేజీకి రూ. 66,300 వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు సోమవారం ఈ విధంగా ఉన్నాయి. ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక సోమవారం (జూన్ 20, 2022) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,680 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,010గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,750 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.51,980 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,010గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,010గా ఉంది.
ఇకపోతే.. హైదరాబాద్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,650 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,980గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,650 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,980గా ఉంది. విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతోన్నాయి.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 61,000 ఉండగా, ముంబైలో రూ.61,000గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.66,300 ఉండగా, కోల్కతాలో రూ.61,000గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.66,300 ఉండగా, కేరళలో రూ.66,300గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.66,300 ఉండగా, విజయవాడలో రూ.66,300 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. అయితే ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.