
బంగారం ధర శాంతించింది. మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు సోమవారం (ఏప్రిల్ 11, 2022) మాత్రం స్థిరంగానే ఉన్నాయి. పసడి బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి రేటులో కూడా మార్పు లేదు. వెండి కూడా 3 రోజులుగా పైపైకి కదులుతూనే వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఇదే ట్రెండ్ ఉంది. బంగారం ధర స్థిరంగానే కొనసాగుతోంది. వెండి మాత్రం పెరిగింది.
బంగారం, వెండి ధరలు సోమవారం నిలకడగా ఉన్నాయి. ధరలు ఒక రోజు తగ్గుముఖం పడితే.. మరో రోజు పెరుగుతున్నాయి. ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక సోమవారం (ఏప్రిల్ 11, 2022) దేశీయంగా బంగారం, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,020గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.49,190 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,660గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,600 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.53,020 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020గా ఉంది.
ఇకపోతే.. హైదరాబాద్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.48,600 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.53,020గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.48,600 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.53,020గా ఉంది. విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతోన్నాయి.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,000 ఉండగా, ముంబైలో రూ.71,500గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.67,000 ఉండగా, కోల్కతాలో రూ.67,000గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,500 ఉండగా, కేరళలో రూ.71,500గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.71,500 ఉండగా, విజయవాడలో రూ.71,500 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. అయితే ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.