కేంద్ర బడ్జెట్ తేదీని ఫిబ్రవరి 28 నుండి 1కి ఎందుకు మార్చారో తెలుసా ?

By Ashok kumar SandraFirst Published Jan 29, 2024, 11:56 AM IST
Highlights

కేంద్ర మధ్యంతర బడ్జెట్ 2024 ఫిబ్రవరి 1న సమర్పించబడుతుంది. గతంలో ఫిబ్రవరి 28న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. 2017 నుంచి ఫిబ్రవరి 1న సమర్పిస్తున్నారు. ఈ మార్పుకు కారణం ఏమిటి? 
 

న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర మధ్యంతర బడ్జెట్ 2024ను ప్రవేశపెట్టనున్నారు. ఏప్రిల్, మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నందున ఈ బడ్జెట్‌లో పెద్దగా ప్రకటనలు  ఉండకపోవచ్చు. కొన్నేళ్ల క్రితం ఫిబ్రవరి నెలాఖరున కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. అది కూడా చివరి వారంలో. అయితే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్‌ సమర్పణ తేదీని ఫిబ్రవరి 28 నుంచి ఫిబ్రవరి 1కి మార్చారు. అప్పటి నుంచి ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సంప్రదాయం మొదలైంది. కాబట్టి కేంద్ర బడ్జెట్ ప్రదర్శన తేదీ ఎలా మారింది ? దీనికి కారణం ఏమిటి? దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇదిగో... 

ఎప్పటి నుంచి ఈ మార్పు?
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీ ఫిబ్రవరి 28 నుండి 2017లో ఫిబ్రవరి 1కి మార్చబడింది. ఫిబ్రవరి 1, 2017న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ కొత్త సంప్రదాయానికి నాంది పలికారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. అలాగే, అదే సమయంలో రైల్వేకు ప్రత్యేక బడ్జెట్ అవసరం లేదని కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే రైల్వే బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్‌లో విలీనం చేశారు. 

Latest Videos

బడ్జెట్ అంటే ఏమిటి?
యూనియన్ బడ్జెట్ అనేది వార్షిక ఆర్థిక నివేదిక, ఇది రాబోయే ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన వ్యయం, రాబడిని అందించే ప్రభుత్వ డాక్యూమెంట్ . ఈ డాక్యూమెంట్  పార్లమెంటు ఆమోదం కోసం సమర్పించబడుతుంది. ఈ సంప్రదాయాన్ని భారతదేశంలో 1860లలో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు తొలిసారిగా ప్రవేశపెట్టారు. 

బడ్జెట్ తేదీ మారడానికి కారణం ఏమిటి?
కేంద్ర బడ్జెట్ ప్రదర్శన తేదీని మార్చడానికి నిర్దిష్ట కారణాలు ఉన్నాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ప్రారంభించింది. బ్రిటీష్ హయాంలో 92 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఆచారానికి స్వస్తి పలికి నెల చివరి రోజు కాకుండా ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెడతామని అరుణ్  జైట్లీ ప్రకటించారు. 

ఫిబ్రవరి నెలాఖరులో బడ్జెట్‌ను సమర్పించనున్నందున, ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త విధానాలు అండ్  మార్పులకు సిద్ధం కావడానికి ప్రభుత్వానికి తక్కువ సమయం ఉంటుంది. తద్వారా ఫిబ్రవరి మొదటి తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నందున, కొత్త విధానాలు ఇంకా మార్పులను అమలు చేయడానికి ప్రభుత్వానికి తగినంత సమయం లభిస్తుంది. దీని కారణంగా తేదీ కూడా మార్చబడింది. 

బడ్జెట్ సమర్పణ సమయంలో కూడా మార్పు వచ్చింది.అంతకుముందు 1999 వరకు కేంద్ర బడ్జెట్‌ను సాయంత్రం 5 గంటలకు సమర్పించేవారు. అయితే అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం  ఉదయం 11 గంటలకు మార్చింది. 

భారతదేశంలో బ్రిటిష్ పాలన అమలులో ఉన్నప్పుడు, బ్రిటిష్ పాలన ఆధారంగా ఇక్కడ బడ్జెట్‌ను సమర్పించారు.  అయితే, భారతదేశానికి స్వాతంత్రం  వచ్చిన తర్వాత కూడా, ఈ సంప్రదాయం చాలా సంవత్సరాలు కొనసాగింది. అయితే 1999-2000 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ సమర్పణ సమయాన్ని నిర్ణయించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. 

click me!