ముకేష్ అంబానీ పిల్లలకు చిన్నప్పటి పాకెట్ మనీ ఎంతో తెలుసా.. నమ్మలేరు..!

Published : Mar 04, 2023, 12:31 PM ISTUpdated : Mar 04, 2023, 12:48 PM IST
 ముకేష్ అంబానీ పిల్లలకు చిన్నప్పటి పాకెట్ మనీ  ఎంతో తెలుసా.. నమ్మలేరు..!

సారాంశం

ముకేశ్ అంబానీ పిల్లలకు చదువుకునే రోజుల్లో కూడా పాకెట్ మనీ చాలా ఎక్కువ అని మీరు అనుకుంటే, ఖచ్చితంగా తప్పుగా భావించినట్లే. ఎందుకంటే నీతా అంబానీ చిన్నప్పుడు తన పిల్లలకు ఇచ్చే పాకెట్ మనీ కేవలం రూ.5 మాత్రమే.   

 ముకేష్ అంబానీ కుటుంబం అంటే మన దేశంలో అత్యంత ధనిక కుటుంబం అని వెంటనే గుర్తొస్తుంది. విలాసవంతమైన బంగ్లా, గొప్ప లైఫ్ స్టయిల్, ప్రతి పనికి మనుషులు ఇంకా వారిని చూసి చాలా మంది చింతిస్తుంటారు ఎందుకంటే జీవితం అంటే ఇలాగే ఉండాలి అని. అలాంటి కుటుంబంలో జన్మించిన పిల్లలు ఎన్నో ప్రయోజనాలు, అధికారాలు  పొందుతారని సామాన్య ప్రజలు నమ్ముతారు. అందుకే ధనిక కుటుంబాల పిల్లలను చూస్తే.. నోట్లో బంగారు చెంచా పెట్టుకుని పుట్టారని అంటారు.

కాబట్టి, భారతదేశంలోని అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తలుగా భావించబడుతున్న ముఖేష్ అంబానీ, నీతా అంబానీల పిల్లలు  చిన్నతనంలో తగినంత పాకెట్ మనీ ఉందని మీరు అనుకుంటే, మీరు తప్పుగా భావించినట్లే. ఇంతకీ ఇషా, ఆకాష్, అనంత్ అంబానీలు చిన్నప్పుడు ఎంత పాకెట్ మనీ తీసుకున్నారు..? వేలకు వేలు ఇస్తారని అనుకుంటే తప్పే. వీరికి పాకెట్ మనీ రూ.5 మాత్రమే లభించేది.  నమ్మడం సాధ్యం కాదు కానీ ఇది నిజం. 

2011లో ఓ ఇంటర్వ్యూలో నీతా అంబానీ  పిల్లలకు ఇచ్చే పాకెట్ మనీ గురించి చెప్పింది. 'నా పిల్లలకు చిన్నప్పుడు ప్రతి శుక్రవారం స్కూల్ క్యాంటీన్‌లో తినడానికి మేం రూ.5 ఇచ్చేవాళ్లం. ఒకరోజు మా చిన్న కొడుకు అనంత్ అంబానీ 10 రూపాయలు కావాలని నా బెడ్‌రూమ్‌కి  వచ్చాడు. ఇంకా 10 రూపాయలు ఇవ్వాలని కూడా డిమాండ్‌ చేసినట్లు పేర్కొన్నారు.  

నా కొడుకుని  10 రూపాయలు ఎందుకు అని అడిగితే, తన స్నేహితులు తనని ఎగతాళి చేస్తున్నారని చెప్పాడు. అంతేకాదు క్యాంటీన్‌లో జేబులోంచి రూ.5 నాణెం బయటకు తీయడం చూసి 'నువ్వు అంబానియా ఆర్ బికారియా' అంటూ ఆటపట్టించారని, అతని మాటలు విని నేనూ, ముఖేష్ కూడా  నవ్వుకున్నాం అంటూ నీతా అంబానీ పాత సంఘటనను గుర్తు చేసుకున్నారు.

ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్‌పర్సన్ సుధా మూర్తి కూడా తన పిల్లలకు చిన్నప్పుడు పెద్దగా పాకెట్ మనీ ఇచ్చేదీ కాదట. తన పుట్టినరోజును చాలా సింపుల్‌గా జరుపుకుంటానని కూడా చాలా సందర్భాలలో చెప్పారు. ఈ ఇద్దరు ధనవంతుల తల్లుల ఉద్దేశ్యం ఏమిటంటే, ఎంతో సంపన్నులైనప్పటికీ పిల్లలకు చిన్నతనంలో డబ్బు  ప్రాముఖ్యతను నేర్పించడం చాలా ముఖ్యం.

ముఖేష్ అంబానీని నీతా అంబానీ  పెళ్లి చేసుకునే ముందు టీచర్ కావాలనుకున్నారు. అయితే పెళ్లయ్యాక తన కలను త్యాగం చేసి మొత్తం కుటుంబ బాధ్యతను తీసుకున్నారు. గతంలో నీతా అంబానీ కూడా తన చిన్నతనంలో తన తల్లి ఎలా క్రమశిక్షణలో ఉండేదో దాని గురించి మాట్లాడింది. తన తల్లి కూడా  పిల్లలను ఎంతో క్రమశిక్షణతో పెంచిందని గుర్తు చేసుకున్నారు.  

PREV
click me!

Recommended Stories

Electric Scooter: లక్ష మంది కొన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది.. ఓలాకు చుక్కలు చూపించింది
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !