Ban on palm oil:షాంపూ-సబ్బుల నుండి చాక్లెట్ వరకు పెరగనున్న ధరలు.. ఏప్రిల్ 28 నుండి ఎగుమతి నిషేధం?

Ashok Kumar   | Asianet News
Published : Apr 26, 2022, 01:57 PM ISTUpdated : Apr 26, 2022, 02:10 PM IST
Ban on palm oil:షాంపూ-సబ్బుల నుండి చాక్లెట్ వరకు పెరగనున్న ధరలు.. ఏప్రిల్ 28 నుండి ఎగుమతి నిషేధం?

సారాంశం

పామాయిల్‌కు వాసన రాదు కాబట్టే చాలా నూనెల్లో కలుపుతారని నిపుణులు చెబుతున్నారు. ఎఫ్‌ఎంసిజి, కాస్మోటిక్స్ కంపెనీలు కూడా పామాయిల్‌ను పెద్ద మొత్తంలో ఉపయోగిస్తాయి. భారతదేశం దాదాపు 9 మిలియన్ టన్నుల పామాయిల్‌ను కొనుగోలు చేస్తుంది. ఇందులో 70 శాతం పామాయిల్ ఇండోనేషియా నుంచి దిగుమతి అవుతోంది.

దేశంలో ఎడిబుల్ ఆయిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఇండోనేషియా ఏప్రిల్ 28 నుంచి పామాయిల్ ఎగుమతిని నిలిపియనుంది. పామాయిల్ అవసరాలలో సగానికి పైగా ఇండోనేషియా నుండి కొనుగోలు చేస్తున్నందున ఈ నిర్ణయం భారతదేశంపై అతిపెద్ద ప్రభావాన్ని చూపనుంది. పామాయిల్ ధర వల్ల ఎడిబుల్ ఆయిల్ ధర పెరగడమే కాకుండా షాంపూలు-సబ్బుల నుంచి కేకులు, బిస్కెట్లు, చాక్లెట్ల ధరలు పెరగనున్నాయి.
 
చాలా నూనెల్లో పామాయిల్‌ను కలుపుతారని ఎందుకంటే వాటికి వాసన ఉండదు అని నిపుణులు తెలిపారు. ఎఫ్‌ఎంసిజి, కాస్మోటిక్స్ కంపెనీలు కూడా పామాయిల్‌ను పెద్ద మొత్తంలో ఉపయోగిస్తాయి. భారతదేశం దాదాపు 9 మిలియన్ టన్నుల పామాయిల్‌ను కొనుగోలు చేస్తుంది. ఇందులో 70 శాతం పామాయిల్ ఇండోనేషియా నుంచి దిగుమతి అవుతోంది. ఇండోనేషియా నుంచి పామాయిల్ ఎగుమతులు నిలిచిపోయిన తర్వాత మలేషియాపై ఆధారపడటం పెరిగి, ఎడిబుల్ ఆయిల్ ధర 20 శాతం వరకు పెరగవచ్చు. 

 పామాయిల్ మొత్తం ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన కూరగాయల నూనె. దీనిని ప్రపంచవ్యాప్తంగా 50 శాతం గృహోపకరణాలలో ఉపయోగించబడుతుంది. పామాయిల్‌ను సాధారణంగా వంట నూనెగా ఉపయోగిస్తారు. ఇంకా షాంపూలు, స్నానపు సబ్బులు, టూత్‌పేస్ట్, విటమిన్ మాత్రలు, సౌందర్య ఉత్పత్తులు, కేకులు, చాక్లెట్లు మొదలైన వాటిలో కూడా ఉపయోగించబడుతుంది. 

ఈ కంపెనీలు అత్యధిక ప్రభావం చూపుతాయి
హిందుస్థాన్ యూనిలీవర్: కంపెనీ 2016లో దాని ఉత్పత్తులలో ప్రతి సంవత్సరం ఒక మిలియన్ టన్నుల ముడి పామాయిల్‌ను ఉపయోగిస్తుందని తెలిపింది. హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ సబ్బులు, షాంపూలు, క్రీమ్‌లు, ఫేస్ వాష్‌లతో సహా డజన్ల కొద్దీ సౌందర్య ఉత్పత్తులను తయారు చేస్తుంది.

నెస్లే: కిట్‌క్యాట్ చాక్లెట్ తయారీ సంస్థ 2020లో 4.53 లక్షల టన్నుల పామాయిల్‌ను కొనుగోలు చేసింది. ఇందులో ఎక్కువ భాగం ఇండోనేషియా నుంచి కొనుగోలు చేయగా, మరికొంత మలేషియా నుంచి దిగుమతి చేసుకున్నారు.

Procter & Gamble: కంపెనీ 2020-21లో 6.05 లక్షల టన్నుల పామాయిల్‌ను కొనుగోలు చేసింది. గృహ సంరక్షణ అండ్ సౌందర్య సాధనాల ఉత్పత్తుల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

మాండెలెజ్ ఇంటర్నేషనల్: ఓరియో బిస్కెట్లను తయారు చేసే కంపెనీ దాని ఉత్పత్తులలో ఉపయోగించడానికి పెద్ద మొత్తంలో పామాయిల్‌ను కొనుగోలు చేస్తుంది.

లోరియల్: కంపెనీ దాని ఉత్పత్తులలో పామాయిల్‌ను ఉపయోగిస్తుంది. 2021లో దాని ఉత్పత్తుల్లో 310 టన్నుల పామాయిల్‌ను ఉపయోగించింది.

ప్రభుత్వం త్వరలో ఇండోనేషియాతో 
SEA ఎడిబుల్ ఆయిల్ పరిశ్రమకు చెందిన సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (SEA) ఆఫ్ ఇండియా, ఇండోనేషియా ప్రతిపాదిత పామాయిల్ ఎగుమతులపై నిషేధానికి సంబంధించి ప్రభుత్వ స్థాయిలో తక్షణమే చర్చలు జరపాలని సూచించింది. ఇండోనేషియా నిర్ణయం మన దేశీయ మార్కెట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని, మొత్తం పామాయిల్ దిగుమతిలో సగం అక్కడి నుంచే వస్తుందని SEA డైరెక్టర్ జనరల్ BV మెహతా అన్నారు. ఈ లోటును ఎవరూ పూరించలేరు. అందుకే ఈ విషయమై కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నాం అని తెలిపారు.

పొద్దుతిరుగుడు, సోయాబీన్ నూనె ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధంతో ఒత్తిడికి గురవుతున్నాయని ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీ కంపెనీ అధికారి తెలిపారు. ఇండోనేషియా చమురుపై నిషేధాన్ని త్వరగా పరిష్కరించకపోతే, అది విస్తృతమైన ప్రతికూల ప్రభావాలకు దారి తీయవచ్చు.

PREV
click me!

Recommended Stories

Today Gold Rate: పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు..భారీగా పతనమైన బంగారం
8th Pay Commission: ఉద్యోగులకు పండగేనా? 8వ వేతన సంఘంపై అదిరిపోయే అప్‌డేట్ !