మళ్లీ ఆకాశాన్నంటిన పెట్రోల్ ధరలు

Published : Sep 06, 2018, 11:50 AM ISTUpdated : Sep 09, 2018, 01:30 PM IST
మళ్లీ ఆకాశాన్నంటిన పెట్రోల్ ధరలు

సారాంశం

గురువారం మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఆయిల్‌ మార్కెటింగ్‌ సంస్థలు పెంచాయి. దీంతో పాత రికార్డులను బద్దలుకొట్టి.. ఇంధన ధరలు సరికొత్త గరిష్ఠాలకు చేరాయి.

పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న సంగతి తెలిసిందే. బుధవారం ధరలు పెరగకుండా స్థిరంగా ఉండటంతో వినియోగదారులు కాస్త ఊపిరి పీల్చుకున్నా.. ఆ ఆనందం ఒక్క రోజుకే పరిమితమైంది. గురువారం మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఆయిల్‌ మార్కెటింగ్‌ సంస్థలు పెంచాయి. దీంతో పాత రికార్డులను బద్దలుకొట్టి.. ఇంధన ధరలు సరికొత్త గరిష్ఠాలకు చేరాయి.

తాజా ధరల ప్రకారం.. దేశ రాజధాని దిల్లీలో గురువారం లీటర్‌ పెట్రోల్‌ ధర 20 పైసలు పెరిగి రూ. 79.51గా ఉంది. ముంబయిలో రూ. 86.91, చెన్నైలో రూ. 82.62, కోల్‌కతాలో రూ. 82.41గా ఉంది. ఇక లీటర్ డీజిల్‌ ధర దిల్లీలో 21 పైసలు పెరిగి రూ. 71.55గా ఉంది. ముంబయిలో రూ. 75.96, చెన్నైలో రూ. 75.61, కోల్‌కతాలో రూ. 74.40గా ఉంది.

డాలర్‌తో రూపాయి మారకం విలువ భారీగా పతనమవుతుండటం, ముడి చమురు ధరలు పెరగడంతో గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చేరుకుంటున్నాయి. అయితే ఇంత పెరుగుతున్నా ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి సానుకూల స్పందన రాకపోగా.. ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించే ఆలోచనేదీ లేదని కేంద్రం చెబుతోంది. దీంతో వాహనదారులు మరింత ఆందోళనకు గురవుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Petrol Price: లీట‌ర్ పెట్రోల్ ధ‌ర‌ కేవ‌లం 2 రూపాయ‌లు మాత్ర‌మే..ఎక్క‌డో తెలుసా.?
Stock Market: 8 రోజుల్లో రూ. 6 ల‌క్ష‌ల కోట్ల న‌ష్టం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ప్ర‌మాదంలో ఉన్నాయా.?