Economic Survey 2023: కరెంటు ఖాతా లోటు మరింత పెరిగే అవవకాశం ఉంది, రూపాయికి గడ్డు కాలమే..

By Krishna AdithyaFirst Published Jan 31, 2023, 4:53 PM IST
Highlights

కరోనా మహమ్మారి తర్వాత భారతదేశంలో రికవరీ వేగంగా పుంజుకుందని ఆర్థిక సర్వే పేర్కొందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇది న దేశీయ డిమాండ్ వృద్ధికి దోహదపడినట్లు ఆమె తెలిపారు. అయితే US ఫెడరల్ రిజర్వ్  వడ్డీ రేటు పెంపుతో రూపాయికి అనేక సవాళ్లను కలిగిస్తుందన్నారు. ప్రపంచ కమోడిటీ ధరలు పెరిగినందున కరెంట్ ఖాతా లోటు (CAD) మరికొంత కాలం విస్తరిస్తూనే ఉండవచ్చు. CAD మరింత పెరిగితే రూపాయి ఒత్తిడికి గురికావచ్చని తెలిపారు. 

మంగళవారం పార్లమెంట్‌లో సమర్పించిన ఆర్థిక సర్వే 2022-23 ప్రపంచ స్థాయిలో వస్తువుల ధరల పెరుగుదల కారణంగా కరెంట్ ఖాతా లోటు మరింత పెరగవచ్చని పేర్కొంది. కాబట్టి దీన్ని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం, సెప్టెంబర్ 2022 త్రైమాసికంలో దేశ కరెంట్ ఖాతా లోటు స్థూల జాతీయోత్పత్తి (GDP)లో 4.4 శాతానికి పెరిగింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఇది జిడిపిలో 2.2 శాతంగా ఉంది.

2022-23 ఆర్థిక సర్వే ఇలా చెప్పింది, “కరోనా అనంతరం  వివిధ రంగాల్లో పునరుద్ధరణ వేగంగా జరగడం కోసం, దేశీయ డిమాండ్‌ను పెంచడం కోసం, దిగుమతులను  పెంచడం ద్వారా కొంత మేర కరెంట్ ఖాతా బ్యాలెన్స్‌కు నష్టాలు పెరిగనట్లు తెలిపారు..” అటువంటి పరిస్థితిలో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు వచ్చే ఏడాదికి వెళ్లే అవకాశం ఉన్నందున కరెంట్ ఖాతా లోటుపై నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.

ఎకనామిక్ సర్వే ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు దిగుమతుల వృద్ధి రేటు ఎగుమతుల వృద్ధి రేటు కంటే చాలా ఎక్కువగా ఉంది. దీంతో వాణిజ్య లోటు పెరిగింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ప్రకారం, ప్రపంచంలోని చాలా కరెన్సీలను రూపాయి మించిపోయినప్పటికీ, యుఎస్ డాలర్‌తో భారత కరెన్సీని వెనకబడటం సవాలుగా మిగిలిపోయింది.

అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ రేట్లను మరింత పెంచడం వల్ల రూపాయిపై ఒత్తిడి  మరింత పెరగవచ్చని పేర్కొన్నారు.  ఆర్థిక సర్వే ఇలా చెబుతోంది, “ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలు ఎక్కువగా ఉండటం, భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వేగంతో వృద్ధి చెందడం వల్ల కరెంట్ ఖాతా లోటు మరింత పెరగవచ్చు. ప్రపంచ వృద్ధి మరియు వాణిజ్యం మందగించడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ప్రపంచ మార్కెట్ పరిమాణం తగ్గిపోయే అవకాశం ఉన్నందున ఎగుమతి ప్రమోషన్‌లో మరింత క్షీణత సాధ్యమవుతుందని పేర్కొన్నారు.  మరోవైపు ప్రపంచ వృద్ధిరేటు మందగించడంతో ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో భారత్ కరెంట్ ఖాతా లోటు ప్రస్తుతం అంచనా వేసిన దానికంటే మెరుగ్గా ఉంటుందని ఆర్థిక సర్వే పేర్కొంది. 

click me!