Tata Ace EV:టాటా చిన్న ఎలక్ట్రిక్ ట్రక్.. సింగిల్ చార్జ్ తో 154 కి.మీ.. బంపర్ ఆర్డర్స్..

Published : May 06, 2022, 04:04 PM IST
Tata Ace EV:టాటా చిన్న ఎలక్ట్రిక్ ట్రక్..  సింగిల్ చార్జ్ తో 154 కి.మీ.. బంపర్ ఆర్డర్స్..

సారాంశం

భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ పాపులర్ కార్గో వాహనం  ఎలక్ట్రిక్ వెర్షన్ అయిన సరికొత్త ఏస్ ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేసింది.

టాటా మోటార్స్ (tata motors) భారతీయ వాహన మార్కెట్లో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన విభాగంలో అగ్రగామిగా నిలిచింది. కంపెనీ ఇప్పుడు లైట్ కమర్షియల్ వెహికల్ (LCV) ఏస్(ACE) ఎలక్ట్రిక్ వెర్షన్‌ను పరిచయం చేసింది. దీంతో  ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్ (CV) స్పేస్‌లోకి టాటా మోటార్స్ ప్రవేశించింది. 

ధరలు 
భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్  పాపులర్ కార్గో వాహనం  ఎలక్ట్రిక్ వెర్షన్ అయిన సరికొత్త Ace EVని విడుదల చేసింది. టాటా మోటార్స్ వచ్చే త్రైమాసికంలో కొత్త ఏస్ EV ధరలను వెల్లడిస్తుంది. మూడవ త్రైమాసికం Q3 2022లో డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. 

బంపర్ ఆర్డర్‌లు
Amazon, BigBasket, City Link, DOT, Flipkart, LetsTransport, MoEVing, Yelo EVలతో సహా అగ్రిగేటర్‌ల గ్రూప్ నుండి 39,000 యూనిట్లకు ఆర్డర్‌లను అందుకున్నట్లు కంపెనీ తెలిపింది.

టాటా సన్స్ అండ్ టాటా మోటార్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ, “ఎలక్ట్రిక్ మొబిలిటీ అనేది ఒక ఆలోచన, దీని సమయం ఆసన్నమైంది.  Ace EV లాంచ్ తో మేము ఇ-కార్గో మొబిలిటీ  కొత్త యుగంలోకి ప్రవేశిస్తున్నాము. కమర్షియల్ వాహనాల విద్యుదీకరణ గురించి నేను సంతోషిస్తున్నాను." అని అన్నారు.

పవర్ అండ్ రేంజ్
టాటా మోటార్ నుండి EVOGEN పవర్‌ట్రైన్‌ మొదటి ఉత్పత్తి Tata Ace EV, ఈ వాహనం 154 కి.మీ పరిధిని అందిస్తుంది. కొత్త మోడల్ లేటెస్ట్ బ్యాటరీ కూలింగ్ సిస్టమ్, రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో సురక్షితమైన ఇంకా ఆల్-వెదర్ రైడ్‌ను అందిస్తుందని పేర్కొన్నారు. 

హై అప్ టైమ్  కోసం వాహనం రెగ్యులర్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్‌కు సపోర్ట్ చేస్తుంది. 130Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే 27kW (36bhp) మోటార్‌ అందించారు. టాటా ఏస్ EV కార్గో వాల్యూమ్ 208 క్యూబిక్ అడుగులు లేదా 3332.16 కిలోలు/క్యూబిక్ మీటర్ అండ్ 22 శాతం గ్రేడ్-ఎబిలిటీ ఉందని క్లెయిమ్ చేయబడింది, అంటే పూర్తిగా లోడ్ అయినప్పుడు కూడా పైకి ఎక్కడానికి సులభతరం చేస్తుంది. 

2005లో ప్రారంభం
టాటా మోటార్స్ భారతదేశం మొట్టమొదటి వాణిజ్యపరంగా విడుదల చేసిన నాలుగు చక్రాల కార్గో ఎలక్ట్రిక్ వాహనం అని పేర్కొంది. కంపెనీ మొదటిసారిగా 2005లో ఏస్‌ను ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 25 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. 

70 శాతం కంటే ఎక్కువ మార్కెట్ వాటా
ఈ వాహనం పెట్రోల్, డీజిల్ అండ్ CNG ఇంజన్ వేరియంట్‌లతో వస్తుంది. టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ మాట్లాడుతూ, "ఈ వాహనం  ఇప్పటికే మా విభాగంలో ప్రాధాన్యత కలిగిన వాహనం, దాని విభాగంలో 70 శాతానికి పైగా మార్కెట్ వాటా ఉంది."అని అన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Bike Mileage : మీ పాత బైక్ పెట్రోల్ ఎక్కువ తాగుతోందా? మైలేజ్ పెంచే 5 సీక్రెట్ టిప్స్ ఇవే
Best Mileage Cars : ఈవి, సీఎన్‌జీ లతో పనే లేదు.. వీటిని తలదన్నేలా మైలేజ్ ఇచ్చే టాప్ 5 పెట్రోల్ కార్లు ఇవే