today astrology: 08 ఫిబ్రవరి 2020 శనివారం రాశిఫలాలు

By telugu teamFirst Published Feb 8, 2020, 7:55 AM IST
Highlights

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలున్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. అనుకోని చిక్కులు. విద్యార్థులకు కొంత కష్టకాలం. నిరంతర నామపారాయణ మంచిది.

డా. ఎస్‌. ప్రతిభ

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : రాజకీయ విషయాలలో ఆసక్తి పెరుగుతుంది. ఒత్తిడి వచ్చే అవకాశాలుంటాయి. అధికారులతో అప్రమత్తంగా మెలగాలి. తొందరపాటు పనికిరాదు. ఉద్యోగస్తులు సంయమనం పాటించడం మంచిది. పనులు పూర్తి చేసే విషయంలో ఆలోచన అవసరం.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలున్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. అనుకోని చిక్కులు. విద్యార్థులకు కొంత కష్టకాలం. నిరంతర నామపారాయణ మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : అనుకున్న పనులు పూర్తి చేయడంలో తొందరపాటు పనికిరాదు. పనులలో ఆలస్యం జరుగుతుంది. వాయిదా వేయడం మంచిది. ఊహించని ఇబ్బందులు, అనుకోని కష్టాలు వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.  శ్రమలేని సంపాదనపై ఆలోచన పెరుగుతుంది.

కర్కాటకం : (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సామాజిక అనుబంధాల్లో ఒత్తిడి తీవ్రమౌతుంది. నూతన పరిచయస్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. పాత పరిచయాలు పెరిగే సూచనలు. జీవిత భాగస్వామ్య అనుబంధాల్లో అప్రమత్తత అవసరం. అన్ని పనుల్లో ఆచి, తూచి వ్యవహరించాలి.

సింహం : (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : పోటీల్లో గెలుపుకై అధిక ప్రయత్నం చేస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. రుణాలు తీర్చే ప్రయత్నంలో ఉంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. శ్రమతో పనులు పూర్తి చేసుకుంటారు.

కన్య : (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. సంతాన సమస్యలు పెరిగే సూచనలున్నాయి. సంతానం విషయంలో ఒత్తిడి తీవ్రం అవుతుంది. క్రియేటివిటీ తగ్గే సూచనలున్నాయి. ఆలోచనలు తగ్గించి నిరంతరం ఏదో ఒక జపం చేసుకోవడం మంచిది.

 తుల : (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) :  కడుపు సంబంధ అనారోగ్యం బయటపడే సూచనలున్నాయి. ఆహారం తీసుకునే విషయంలో తక్కువ తీసుకోవడం మంచిది. జీర్ణక్రియ లోపాలు వస్తాయి. సౌకర్యాలకు దూరంగా ఉండడం మంచిది. ఇంటి పనులు వాయిదా వేయడం మంచిది.

వృశ్చికం : (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  సేవకజన సహకారం లభిస్తుంది. సేవకులతో అనుకూలత పెంచుకుంటారు. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. తోటివారితో అనుబంధాలు బలపడతాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. సమయం సద్వినియోగం చేసుకోవాలి.

ధనుస్సు : (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : మాట విషయంలో తొందరపాటు పనికిరాదు. ఆచి, తూచి మాట్లాడాలి. అపార్థాలకు అవకాశం ఎక్కువ. కుటుంబ సంబంధాలు మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయాలి. నిల్వధనం కోల్పోయే సూచనలు. దానధర్మాలు అధికంగా చేయడం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శారీరక శ్రమ అధికం అవుతుంది. పనులలో ఒత్తిడి పెరుగుతుంది. ఒకే పనికోసం 3,4సార్లు తిరిగే అవసరం రావచ్చు. సమయం, కాలం, వ్యర్థం అవుతాయి.  ప్రణాళికాబద్ధమైన పనులు పూర్తి చేయలేరు. తొందరపడి పనులు పూర్తి చేయాలి.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : విశ్రాంతి తగ్గుతుంది. పాదాల నొప్పులు వస్తాయి. అనవసర ఖర్చులు చేస్తారు. అనవసర ప్రయాణాలు చేస్తారు. దూర ప్రయాణాలపై ఆలోచన పెరుగుతుంది.  స్థాన చలనం కలుగుతుంది. ఉద్యోగస్తులు మార్పు జరిగే అవకాశం.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సేవకుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. లాభాలు సద్వినియోగం చేసే ప్రయత్నం చేస్తారు. సంతోషం లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఇతరులపై ఆధారపడతారు. కళాకారులకు అనుకూలమైన సమయం. దురాశ పెరుగుతుంది. సమిష్టి ఆశయాలు నెరవేరుతాయి.

click me!