అభినందన్ క్షేమంగా తిరిగి రావాలి: వైఎస్ జగన్ ఆకాంక్ష

Published : Feb 28, 2019, 08:33 AM IST
అభినందన్ క్షేమంగా తిరిగి రావాలి: వైఎస్ జగన్ ఆకాంక్ష

సారాంశం

ఈ కష్టకాలంలో అతని కుటుంబానికి మనోధైర్యాన్నిఇవ్వాలని కోరారు. అభినందన్‌ క్షేమంగా తిరిగి రావాలని ఆ భగవంతుడ్ని ప్రారిస్తున్నానంటూ వైఎస్ జగన్ ట్వీట్‌ చేశారు. ఇకపోతే బుధవారం ఉదయం పాక్‌ విమానాలు భారత భూభాగంలోకి చొరబడ్డాయి. 

హైదరాబాద్‌ :పాక్ యుద్ధ విమానాలను వెనక్కి తిప్పికొడుతున్న సమయంలో పాక్ ఆర్మీకి చిక్కిన భారత పైలట్‌ విక్రమ్‌ అభినందన్‌ క్షేమంగా తిరిగి రావాలని వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. 

ఈ కష్టకాలంలో అతని కుటుంబానికి మనోధైర్యాన్నిఇవ్వాలని కోరారు. అభినందన్‌ క్షేమంగా తిరిగి రావాలని ఆ భగవంతుడ్ని ప్రారిస్తున్నానంటూ వైఎస్ జగన్ ట్వీట్‌ చేశారు. ఇకపోతే బుధవారం ఉదయం పాక్‌ విమానాలు భారత భూభాగంలోకి చొరబడ్డాయి. 

భారత వైమానిక దళాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఆ సమయంలో భారత పైలట్‌ అభినందన్‌ ఉన్న మిగ్ 21న విమానం పాకిస్థాన్ లో కుప్పకూలిపోయింది. దీంతో విక్రమ్ అభినందన్ పాక్‌ సైన్యానికి చిక్కారు. 

ఈ విషయాన్ని దృవీకరిస్తూ పాక్‌ ఓ విడియోను విడుదల చేసింది. ప్రస్తుతం పైలెట్‌ తమ దగ్గరే ఉన్నట్లు పాకిస్తాన్‌ ప్రకటించింది. భారత పైలట్‌ ఒకరు పాకిస్తాన్‌ సైన్యానికి చిక్కారని భారత్‌ కూడా ధృవీకరించిన విషయం తెలిసిందే. 

 

PREV
click me!

Recommended Stories

Flash Floods Alert : తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం.. పోటెత్తిన వరదనీరు, ఈ ప్రాంతాల్లో ప్లాష్ ప్లడ్స్ తప్పవా?
విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ ఛార్జీలు 10 శాతం పెంచుతూ నిర్ణయం