
హైదరాబాద్ :పాక్ యుద్ధ విమానాలను వెనక్కి తిప్పికొడుతున్న సమయంలో పాక్ ఆర్మీకి చిక్కిన భారత పైలట్ విక్రమ్ అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు.
ఈ కష్టకాలంలో అతని కుటుంబానికి మనోధైర్యాన్నిఇవ్వాలని కోరారు. అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని ఆ భగవంతుడ్ని ప్రారిస్తున్నానంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఇకపోతే బుధవారం ఉదయం పాక్ విమానాలు భారత భూభాగంలోకి చొరబడ్డాయి.
భారత వైమానిక దళాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఆ సమయంలో భారత పైలట్ అభినందన్ ఉన్న మిగ్ 21న విమానం పాకిస్థాన్ లో కుప్పకూలిపోయింది. దీంతో విక్రమ్ అభినందన్ పాక్ సైన్యానికి చిక్కారు.
ఈ విషయాన్ని దృవీకరిస్తూ పాక్ ఓ విడియోను విడుదల చేసింది. ప్రస్తుతం పైలెట్ తమ దగ్గరే ఉన్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. భారత పైలట్ ఒకరు పాకిస్తాన్ సైన్యానికి చిక్కారని భారత్ కూడా ధృవీకరించిన విషయం తెలిసిందే.