బాబుపై డౌట్, స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఆంధ్రా పోలీసులు వద్దు: సిఈసీకి విజయసాయిరెడ్డి లేఖ

Published : Apr 13, 2019, 02:51 PM ISTUpdated : Apr 13, 2019, 02:53 PM IST
బాబుపై డౌట్,  స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఆంధ్రా పోలీసులు వద్దు: సిఈసీకి విజయసాయిరెడ్డి లేఖ

సారాంశం

ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించవద్దని సీఎం నేరుగా సీఈవోకు చెప్తున్నారని ఈ నేపథ్యంలో రాష్ట్రపోలీసులకు బదులు కేంద్ర పోలీసులనే స్ట్రాంగ్ రూమ్ ల వద్ద కాపలాగా ఉంచాలని కోరారు. 

ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి లేఖ రాశారు. ఈవీఎంల రక్షణకు కేంద్ర బలగాలను వినియోగించాలని లేఖలో కోరారు. 
 స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సీఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ బలగాలను మోహరించాలని సూచించారు. 

అన్ని స్ట్రాంగ్ రూమ్ లో 24 గంటలు సీసీటీవీ కెమెరాలు పనిచేసేలా అమర్చాలని కోరారు. ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించవద్దని సీఎం నేరుగా సీఈవోకు చెప్తున్నారని ఈ నేపథ్యంలో రాష్ట్రపోలీసులకు బదులు కేంద్ర పోలీసులనే స్ట్రాంగ్ రూమ్ ల వద్ద కాపలాగా ఉంచాలని కోరారు. 

రాష్ట్ర పోలీసులపై తమకు నమ్మకం లేదని విజయసాయిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. ప్రజల తీర్పును పటిష్టంగా భద్రపరచాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu