ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించవద్దని సీఎం నేరుగా సీఈవోకు చెప్తున్నారని ఈ నేపథ్యంలో రాష్ట్రపోలీసులకు బదులు కేంద్ర పోలీసులనే స్ట్రాంగ్ రూమ్ ల వద్ద కాపలాగా ఉంచాలని కోరారు.
ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి లేఖ రాశారు. ఈవీఎంల రక్షణకు కేంద్ర బలగాలను వినియోగించాలని లేఖలో కోరారు.
స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సీఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ బలగాలను మోహరించాలని సూచించారు.
అన్ని స్ట్రాంగ్ రూమ్ లో 24 గంటలు సీసీటీవీ కెమెరాలు పనిచేసేలా అమర్చాలని కోరారు. ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించవద్దని సీఎం నేరుగా సీఈవోకు చెప్తున్నారని ఈ నేపథ్యంలో రాష్ట్రపోలీసులకు బదులు కేంద్ర పోలీసులనే స్ట్రాంగ్ రూమ్ ల వద్ద కాపలాగా ఉంచాలని కోరారు.
రాష్ట్ర పోలీసులపై తమకు నమ్మకం లేదని విజయసాయిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. ప్రజల తీర్పును పటిష్టంగా భద్రపరచాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.