ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి నామినేషన్ దాఖలు

Published : Jun 17, 2019, 04:13 PM IST
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి నామినేషన్  దాఖలు

సారాంశం

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి నామినేషన్ దాఖలు చేశారు. రఘువతి నామినేషన్‌ను బలపరుస్తూ పది మంది ఎమ్మెల్యేలు బలపర్చారు.  

అమరావతి: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి నామినేషన్ దాఖలు చేశారు. రఘువతి నామినేషన్‌ను బలపరుస్తూ పది మంది ఎమ్మెల్యేలు బలపర్చారు.
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. రేపు డిప్యూటీ స్పీకర్ ఎన్నికలు జరగనున్నాయి.

ఇవాళ సాయంత్రం ఐదు గంటల వరకు  నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి బ్రహ్మణ సామాజిక వర్గానికి కేటాయించాలని  నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు కోన రఘుపతి ఈ పదవికి నామినేషన్  దాఖలు చేశారు.

రఘుపతి నామినేషన్ ను బలపరుస్తూ పది మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడ నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం నాడు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్  పదవికి ఎన్నికలు జరగనున్నాయి.

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu