చంద్రబాబు రోడ్ షోను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు.. గో బ్యాక్ అంటూ నినాదాలు, రాళ్ల దాడి

Siva Kodati |  
Published : Aug 04, 2023, 03:44 PM IST
చంద్రబాబు రోడ్ షోను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు.. గో బ్యాక్ అంటూ నినాదాలు, రాళ్ల దాడి

సారాంశం

అన్నమయ్య జిల్లా కురబలకోటలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షోను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో తెలుగుదేశం కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. ఇరువర్గాలు పరస్పరం రాళ్ల దాడికి పాల్పడ్డాయి. 

అన్నమయ్య జిల్లా కురబలకోటలో ఉద్రిక్త పరిస్ధితి నెలకొంది. మండలంలోని అంగళ్లు కూడలిలో శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షోను వైసీపీ నేతలు , కార్యకర్తలు అడ్డుకున్నారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ వారు నినాదాలు చేశారు. దీనిపై భగ్గుమన్న టీడీపీ శ్రేణులు వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడి చేసుకోవడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. వెంటనే స్పందించిన పోలీసులు లాఠీఛార్జీ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు..ఏపీలో వర్షాలు స్టార్ట్ | Asianet News Telugu
Weather Update : బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. మరి వర్షాలు ఎక్కడ? ఎప్పట్నుంచి కురుస్తాయి?