వైఎస్ వివేకా కేసు: నిందితులకు జైలు మార్పు, రిమాండ్ పొడిగింపు

Siva Kodati |  
Published : May 20, 2019, 05:21 PM IST
వైఎస్ వివేకా కేసు: నిందితులకు జైలు మార్పు, రిమాండ్ పొడిగింపు

సారాంశం

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది.

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. ఈ కేసులో అరెస్టైన ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్‌లను పులివెందులలోని జూనియర్ సివిల్ కోర్డులో పోలీసులు సోమవారం హాజరుపరిచారు.

ఈ మేరకు న్యాయమూర్తి నిందితులకు జూన్ 3 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కడపలోని కేంద్ర కారాగారం నుంచి పులివెందులలోని సబ్‌ జైలుకు తమను తరలించాలని నిందితులు పెట్టుకున్న పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం.. వారి విజ్ఞప్తిని మన్నించి ముగ్గురు నిందితులను పులివెందులలోని సబ్ జైలుకు తరలించాలని పోలీసులను ఆదేశించింది. 
 

PREV
click me!

Recommended Stories

ఆంధ్ర‌ప్ర‌దేశ్ భ‌విష్య‌త్తును మార్చే ప్రాజెక్ట్‌.. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారం మైనింగ్
Pemmasani Speech: రజతోత్సవ కార్యక్రమంలోపెమ్మసాని అదిరిపోయే స్పీచ్ | Cancer Hospital Silver Jubilee