వైఎస్ వివేకా కేసు: నిందితులకు జైలు మార్పు, రిమాండ్ పొడిగింపు

Siva Kodati |  
Published : May 20, 2019, 05:21 PM IST
వైఎస్ వివేకా కేసు: నిందితులకు జైలు మార్పు, రిమాండ్ పొడిగింపు

సారాంశం

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది.

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. ఈ కేసులో అరెస్టైన ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్‌లను పులివెందులలోని జూనియర్ సివిల్ కోర్డులో పోలీసులు సోమవారం హాజరుపరిచారు.

ఈ మేరకు న్యాయమూర్తి నిందితులకు జూన్ 3 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కడపలోని కేంద్ర కారాగారం నుంచి పులివెందులలోని సబ్‌ జైలుకు తమను తరలించాలని నిందితులు పెట్టుకున్న పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం.. వారి విజ్ఞప్తిని మన్నించి ముగ్గురు నిందితులను పులివెందులలోని సబ్ జైలుకు తరలించాలని పోలీసులను ఆదేశించింది. 
 

PREV
click me!

Recommended Stories

Reddappagari Madhavi Reddy Satirical Comments On YSRCP Party | Asianet News Telugu
School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. ఇలా స్కూళ్లు రీఓపెన్ కాగానే అలా సెలవులు.. ఎన్నిరోజులో తెలుసా?