వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్ట్‌లో మరో పిటిషన్ దాఖలు చేసిన సునీత

Siva Kodati |  
Published : May 12, 2023, 06:50 PM ISTUpdated : May 12, 2023, 06:53 PM IST
వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్ట్‌లో మరో పిటిషన్ దాఖలు చేసిన సునీత

సారాంశం

వైఎస్ వివేకా కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు ఆయన కుమార్తె డాక్టర్ సునీత. వివేకా హత్య కేసును పర్యవేక్షించేలా ట్రయల్ కోర్టును ఆదేశించాలని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. 

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన కుమార్తె డాక్టర్ సునీత సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసును పర్యవేక్షించేలా ట్రయల్ కోర్టును ఆదేశించాలని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. వివేకా కేసు దర్యాప్తును పర్యవేక్షించాల్సిందిగా తొలుత సునీత ట్రయల్ కోర్టును ఆశ్రయించారు.

అయితే వివేకా కేసును జూన్ 30 నాటికి పూర్తి చేయాలని సుప్రీంకోర్ట్ సీబీఐకి డెడ్ లైన్ విధించింది. ఈ నేపథ్యంలో కేసును తాము పర్యవేక్షించలేమని ట్రయల్ కోర్ట్ సునీత పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో ఆమె సుప్రీంకోర్ట్ మెట్లెక్కారు. వివేకా కేసు దర్యాప్తును పర్యవేక్షించాల్సిందిగా ట్రయల్ కోర్ట్‌ను ఆదేశించాలని.. గతంలో సుప్రీంకోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులపై స్పష్టత ఇవ్వాలని సునీత సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. 

మరోవైపు.. వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురైన స్థలంలో లభించిన లేఖపై వేలిముద్రలను గుర్తించేందుకు నిన్‌హైడ్రేట్ పరీక్ష జరిపించాలని నిర్ణయించింది. ఇందుకోసం సీబీఐ అధికారులు.. సీబీఐ కోర్టు అనుమతి కోరారు. వివరాలు.. 2019 మార్చి 15న పులివెందులలోని తన సొంత నివాసంలో వైఎస్ వివేకా హత్యకు గురైన సంగతి  తెలిసిందే. అయితే వివేకా హత్య స్థలంలో వివేకానందరెడ్డి రాసినట్టుగా చెబుతున్న లేఖ లభించింది. 

Also Read: వివేకా హత్య కేసులో సీబీఐ కీలక నిర్ణయం.. ఆ లేఖపై నిన్‌హైడ్రైట్ పరీక్షకు అనుమతి కోరుతూ పిటిషన్..!!

అయితే ఈ లేఖను సీబీఐ 2021 ఫిబ్రవరి 11న ఢిల్లీలోని సీఎఫ్‌ఎస్‌‌ఎల్‌కు పంపింది. అయితే పరీక్షల అనంతరం వివేకా ఒత్తిడిలో లేఖ రాసినట్టుగా సీఎఫ్‌ఎస్‌ఎల్ తేల్చింది. తాజాగా ఈ లేఖపై వేలిముద్రలను సేకరించేందుకు సీబీఐ సిద్దమైంది. ఈ క్రమంలోనే లేఖపై ఉన్న వేలిముద్రలు కూడా గుర్తించాలని సీఎఫ్ఎస్‌ఎల్‌ను సీబీఐ కోరింది. లేఖపై వేలిముద్రల గుర్తింపునకు నిన్‌హైడ్రేట్ పరీక్ష చేయాలని సీఎఫ్‌ఎస్‌ఎల్ సూచించింది. పరీక్ష ద్వారా  లేఖపై రాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉందని తెలిపింది. 

ఈ నేపథ్యంలో నేసీబీఐ అధికారులు సీబీఐ కోర్టును ఆశ్రయించారు. వివేకా హత్య స్థలంలో లభించిన లేఖపై నిన్‌హైడ్రేట్ పరీక్షకు అనుమతివ్వాలని కోరారు. లేఖపై వేలిముద్రలను అనుమానితుల వేలిముద్రలతో పోల్చాల్సి ఉందని తెలిపారు. లేఖపై రాత, ఇంకు దెబ్బతింటే.. రికార్డుల్లో ఒరిజినల్ లేఖ బదులుగా కలర్ జిరాక్స్‌ను అనుమతించాలని కూడా కోరారు. 

ఇక, అయితే సీబీఐ దాఖలు  చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టు నిందితుల స్పందన కోరింది. ఇక, సీబీఐ పిటిషన్‌పై సీబీఐ కోర్టు జూన్ 2వ తేదీన విచారణ చేపట్టనుంది. ఇదిలా ఉంటే.. ఈ లేఖ గురించే వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి  ప్రధానంగా  ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల సీబీఐ అధికారులు ఈ లేఖకు సంబంధించి వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి, వంట మనిషి కొడుకును విచారించిన సంగతి  తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!