ఏపీ సీఎం జగన్ అమెరికా టూర్ ఖరారు

Published : Jul 23, 2019, 03:01 PM IST
ఏపీ సీఎం జగన్ అమెరికా టూర్ ఖరారు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమెరికా టూర్ కు వెళ్లనున్నారు. అమెరికాలో వారం రోజుల పాటు పర్యటిస్తారు.ఈ మేరకు జగన్ అమెరికా టూర్ ఖరారైంది.

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ అమెరికా టూర్‌కు వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి జగన్ అమెరికా వెళ్తారు.వారం రోజుల పాటు జగన్ అమెరికాలో పర్యటిస్తారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగన్ తొలిసారిగా అమెరికాకు వెళ్తున్నారు.  ఆగష్టు 17వ తేదీ నుండి 23వ తేదీవరకు అమెరికాలో పర్యటిస్తారు. అమెరికాలో నార్త్ అమెరికా తెలుగు కమ్యూనిటీ ఆహ్వాన సభలో జగన్ పాల్గొంటారు. ఈ నెల 17వ తేదీన ఈ కార్యక్రమం ఉంటుంది.

ఆ తర్వాత డల్లాస్‌లో జరిగే కేబెల్లే కన్వెన్షన్ సెంటర్‌లో ప్రవాస భారతీయులు నిర్వహించే భారీ సభలో కూడ  జగన్ పాల్గొంటారని సమాచారం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికాకు జగన్ కుటుంబసభ్యులతో వెళ్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎంటెక్ చదివి కలెక్టర్‌గా ఎదిగి.. ఏపీ కొత్త సీఎస్ సాయి ప్ర‌సాద్ నేప‌థ్యం ఏంటో తెలుసా.?
IMD Rain Alert : సముద్రంలో భయంకర తుపాను.. ఈ తెలుగు జిల్లాల్లో వర్షాలు, ఎల్లో అలర్ట్