
ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీపీఆర్వో పూడి శ్రీహరిని పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం తాడేపల్లిలోని నివాసానికి శ్రీహరి వస్తుండగా.. పోలీసులు నాటకీయంగా ఆయన్ను అనుసరించి అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజీ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రోడ్డుపై పోలీసులు శ్రీహరిని వెంబడించడం.. కాసేపు వారి మధ్య వాగ్వాదం.. ఆ తర్వాత పోలీసులు వాహనంలో ఎక్కించుకొని వెళ్లిన దృశ్యాలు ఈ సీసీ ఫుటేజీలో కనిపిస్తున్నాయి.