లంచం లేకుండా పనులు జరుగుతున్నాయా: ప్రశ్నించిన జగన్

Published : Jul 16, 2019, 02:05 PM IST
లంచం లేకుండా పనులు జరుగుతున్నాయా: ప్రశ్నించిన జగన్

సారాంశం

లంచం లేకుండా పనులు జరుగుతున్నాయని ప్రజలు విశ్వాసాన్ని పెంచుకొనేలా పనిచేయాల్సిన అవసరం ఉందని  ఏపీ సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు.

అమరావతి: లంచం లేకుండా పనులు జరుగుతున్నాయని ప్రజలు విశ్వాసాన్ని పెంచుకొనేలా పనిచేయాల్సిన అవసరం ఉందని  ఏపీ సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు.

స్పందన కార్యక్రమంపై మంగళవారం నాడు సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.  ఈ నెల 1వ తేదీ నుండి 12వ తేదీ వరకు వచ్చిన  స్పందన కార్యక్రమంపై  ఆయన  సమీక్ష నిర్వహించారు. 

ఈ సమీక్షలో  పలు అంశాలపై జగన్ కలెక్టర్లు,ఎస్పీలను ప్రశ్నించారు. అవినీతిపై కలెక్టర్లను సూటిగా సీఎం జగన్ ప్రశ్నించారు.  ఎమ్మార్వో, పోలిస్‌స్టేషన్లలో అవినీతి లేదనుకోవాలా అని ఆయన ప్రశ్నించారు.  ఇక్కడ అవినీతి లేదని ధైర్యంగా చెబుతారా అని ఆయన అడిగారు.

అవినీతిని తాను సహించబోనని జగన్ మరోసారి స్పష్టం చేశారు. అవినీతికి దూరంగా ఉండాలని  ఏపీ సీఎం జగన్  ఆదేశించారు. లంచం లేకుండా పనుులు జరుగుతున్నాయని ప్రజలు విశ్వాసం పొందేలా పనులు చేయాలని  ఆయన అధికారులను ఆదేశించారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?