ఏపీ అసెంబ్లీ సమావేశాలు : కరోనా వ్యాక్సిన్‌పై సీఎం జగన్ కీలక ప్రకటన

Bukka Sumabala   | Asianet News
Published : Dec 05, 2020, 12:19 PM IST
ఏపీ అసెంబ్లీ సమావేశాలు : కరోనా వ్యాక్సిన్‌పై సీఎం జగన్ కీలక ప్రకటన

సారాంశం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో  కరోన వ్యాక్సిన్‌కు సంబంధించి సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. కరోనా నియంత్రణ, ప్రభుత్వ ఆరోగ్య విధానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఈ విధంగా సమాధానమిచ్చారు. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో  కరోన వ్యాక్సిన్‌కు సంబంధించి సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. కరోనా నియంత్రణ, ప్రభుత్వ ఆరోగ్య విధానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఈ విధంగా సమాధానమిచ్చారు. 

కేంద్రం మొదటి విడతలో రాష్ట్రానికి కోటిమందికి సరిపడా టీకాలను సరఫరా చేయనుందని.. టీకా నిల్వ, సరఫరాకు ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా సూచించిందన్నారు. కేంద్రం నుంచి వస్తున్న సంకేతాల ప్రకారం టీకా వచ్చేందుకు 3, 4 నెలలు సమయం పడుతుందన్నారు. 

టీకాలు వేయడంలో ఆశ వర్కర్లకు శిక్షణ ఇస్తామని.. మొదటివిడతలో 3.60 లక్షల వైద్యసిబ్బంది, ఫ్రంట్‌ లైన్‌ సిబ్బంది 7 లక్షలు, 50 ఏళ్లు పైబడిన 90 లక్షల మందికి టీకా ఇవ్వనున్నట్లు తెలిపారు. టీకా నిల్వ కోసం ఫ్రిజ్‌లు, ఫ్రీజర్లు సిద్ధం చేశామన్నారు.. మిగిలిన ఏర్పాట్లు చేశామన్నారు.

కరోనాపై గత 9 నెలలుగా యుద్ధం చేస్తున్నామన్నారు సీఎం జగన్. మరికొన్ని నెలలు జాగ్రత్తగా ఉండాలని.. ఫ్రాన్స్‌, ఇటలీ, బ్రిటన్‌ లాక్‌డౌన్‌లో ఉన్నాయని.. టీకా అందరికీ సరఫరా చేయడం ఇప్పుడు కుదరదు అన్నారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, కేరళ, గుజరాత్‌ల్లో కేసులు పెరుగుతున్నాయని.. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ల్లో రాత్రిపూట కర్ఫ్యూ పెడుతున్నారని చేశారు. 

PREV
click me!

Recommended Stories

Janhvi Kapoor Visits Tirumala | Walks Alipiri Footpath: శ్రీవారి సేవలో జాన్వీ కపూర్ | Asianet Telugu
CM Chandrababu Powerful Speech: అసెంబ్లీ లో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu