కాషాయం కప్పుకున్నా..గుండె నిండా బాబే: సుజనాపై విజయసాయి ఫైర్

By narsimha lodeFirst Published Aug 28, 2019, 10:54 AM IST
Highlights

మీరు శుద్ధపూసలా మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నా.. మీ హృదయం నిండా బాబే ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కోవర్టుగానే బీజేపీలో చేరారని.. మీ ప్రతి చర్యను బీజేపీ అధిష్టానం గమనిస్తోందని విజయసాయి ధ్వజమెత్తారు. 

బీజేపీ ఎంపీ సుజనా చౌదరిపై ట్విట్టర్ సాక్షిగా మండిపడ్డారు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి. మీ రాజకీయ జీవితమంతా చౌకబారు విన్యాసాలేనంటూ ఫైరయ్యారు.

రెండు సార్లు రాజ్యసభ సభ్యత్వం, కేంద్ర మంత్రి పదవి కోసం చంద్రబాబుకు ఎంత కప్పం కట్టారో అందరికీ తెలుసునంటూ వ్యాఖ్యానించారు.

మీరు శుద్ధపూసలా మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నా.. మీ హృదయం నిండా బాబే ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కోవర్టుగానే బీజేపీలో చేరారని.. మీ ప్రతి చర్యను బీజేపీ అధిష్టానం గమనిస్తోందని విజయసాయి ధ్వజమెత్తారు. 

మీ రాజకీయ జీవితమంతా చౌకబారు విన్యాసాలే గదా సుజనా చౌదరి గారూ? రెండు సార్లు రాజ్యసభ సభ్యుడవడానికి, కేంద్ర మంత్రి పదవి కోసం ఛంద్రబాబు గారికి ఎంత కప్పం కట్టారో బహిరంగ రహస్యమే. ఢిల్లీలో కూడా అందరికీ తెలుసు. అలాంటి మీరు సుద్దపూసలా మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు.

— Vijayasai Reddy V (@VSReddy_MP)

బిజెపీలో చేరినా మీ హృదయం నిండా చంద్రబాబు గారే ఉన్నారు. ఆయన కోవర్టుగానే కదా మీరు పార్టీ మారింది. మీ ప్రతి చర్యనూ బిజెపి గమనిస్తుందనే అనుకుంటున్నాను. బిజెపీలో చేరి వారి విధి విధానాలకు వ్యతిరేకంగా టీడీపీ ప్రయోజనాల కోసం ఎందుకు మాట్లాడుతున్నారో తెలిసి పోతూనే ఉంది.

— Vijayasai Reddy V (@VSReddy_MP)

సుజనా.. భూ ఖజానా pic.twitter.com/iTbKoTjLyB

— Vijayasai Reddy V (@VSReddy_MP)
click me!