పల్నాడు జిల్లాలో విషాదం.. కాల్వలోకి దూకిన యువతిని కాపాడేందుకు యత్నించిన వ్యక్తి.. ఇద్దరు మృతి..

By Sumanth KanukulaFirst Published Sep 12, 2022, 10:53 AM IST
Highlights

పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ముప్పాళ్ల నార్న్‌పాడు మేజర్ కాల్వలోకి దూకి ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. అయితే యుతితో పాటు ఆమెను కాపాడేందుకు యత్నించిన వ్యక్తి కూడా మృతిచెందాడు.

పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ముప్పాళ్ల నార్న్‌పాడు మేజర్ కాల్వలోకి దూకి ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. అయితే యువతిని కాపాడేందుకు ఓ వ్యక్తి కూడా కాల్వలోకి దూకాడు. ఈ ఘటన యువతితో పాటు.. ఆమెను కాపాడేందుకు  కాల్వలోకి దూకిన వ్యక్తి కూడా మృతిచెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కాల్పలో నుంచి ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. అయితే యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 

click me!