జగన్‌ను ప్రజలు మళ్లీ ఎందుకు సీఎంగా ఎన్నుకోవాలి.. : వైఎస్ఆర్సీపీపై సీపీఐ ఫైర్

Published : Oct 10, 2023, 04:59 PM IST
జగన్‌ను ప్రజలు మళ్లీ ఎందుకు సీఎంగా ఎన్నుకోవాలి.. :  వైఎస్ఆర్సీపీపై సీపీఐ ఫైర్

సారాంశం

Amaravati: వైఎస్ఆర్సీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ప్రజలు మళ్లీ సీఎంగా ఎందుకు ఎన్నుకోవాలని సీపీఐ ప్ర‌శ్నించింది. వ్య‌క్తిగ‌త స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశార‌ని మండిప‌డింది. ఏపీ ప్రయోజనాలను జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కారు బీజేపీకి తాకట్టు పెడుతోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు.  

CPI AP secretary K Ramakrishna: వైఎస్ఆర్సీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ప్రజలు మళ్లీ సీఎంగా ఎందుకు ఎన్నుకోవాలని సీపీఐ ప్ర‌శ్నించింది. వ్య‌క్తిగ‌త స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశార‌ని మండిప‌డింది. ఏపీ ప్రయోజనాలను జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కారు బీజేపీకి తాకట్టు పెడుతోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు.

వివ‌రాల్లోకెళ్తే.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కానవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ అన్నారు. ప్రకాశం జిల్లాపార్టీ కార్యాలయం మల్లయ్య లింగం భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తన రాజకీయ, వ్యక్తిగత ఆకాంక్షల కోసం రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు పెడుతోందని విమ‌ర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారనీ, ప్రజలు ఆయనను మళ్లీ ఎందుకు ముఖ్య‌మంత్రిగా ఎన్నుకోవాలని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేయడంలో జగన్ ప్రధాన సూత్రధారి అని ఆరోపించారు.

ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని జగన్ హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదన్నారు. విద్యాభివృద్ధిలో దేశంలోని ఇతర రాష్ట్రాలు ఆంధ్ర నమూనాను అనుసరించాలని ఉవ్విళ్లూరుతున్నాయనీ, కానీ గత నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్ర‌యివేటు పాఠశాలలకు సుమారు ఆరు లక్షల మంది విద్యార్థులు మారార‌ని ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి తన ప్రయోజనాల కోసం బీజేపీతో రాష్ట్ర ప్రయోజనాలను వ్యాపారం చేస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు. అమరరాజా, జాకీ, తైవాన్ కంపెనీ వంటి పరిశ్రమలను జగన్ రాష్ట్రం నుంచి తరిమికొట్టారని ఆరోపించారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా కృష్ణా జలాల కేటాయింపులు చేసి తెలంగాణ ప్రజలను ఆకట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు.

కృష్ణా జలాల విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 18న కడపలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద కొట్టుకుపోయిన గేటును నిర్మించడానికి ఏ కాంట్రాక్టర్ ముందుకు రావడం లేదని నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడాలని రామకృష్ణ అన్నారు. గేటుకు వెంటనే రూ.10 కోట్లు విడుదల చేసి వెంటనే సరిచేయాలని సీఎం జగన్ ను డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీలు కలిసి రికార్డు స్థాయిలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ప్ర‌జ‌లు త‌మ‌కు మ‌ద్ద‌తు తెల‌పాల‌ని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ ఏపీ కార్యవర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య, సీపీఐ ప్రకాశం కార్యదర్శి ఎంఎల్ నారాయణ పాల్గొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : అల్పపీడనానికి తోడైన ఉపరితల ద్రోణి.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇక అల్లకల్లోలమే
Rajamahendravaram Milk adulterated: కల్తీ పాలు వినియోగించిన వారి ఆరోగ్య పరిస్థితి| Asianet Telugu