టికెట్లు ఇప్పిస్తానని గాలం: టీడీపీ, వైసీపీ నేతల నుంచి కోట్లు వసూలు

Siva Kodati |  
Published : Jun 19, 2019, 05:15 PM ISTUpdated : Jun 19, 2019, 05:24 PM IST
టికెట్లు ఇప్పిస్తానని గాలం: టీడీపీ, వైసీపీ నేతల నుంచి కోట్లు వసూలు

సారాంశం

ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి టిక్కెట్లు ఇప్పిస్తానని పలువురి నుంచి డబ్బు వసూలు చేసిన వైట్ కాలర్ నేరస్తుడిని విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి టిక్కెట్లు ఇప్పిస్తానని పలువురి నుంచి డబ్బు వసూలు చేసిన వైట్ కాలర్ నేరస్తుడిని విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనకు వైసీపీ, టీడీపీ అధిష్టానాల వద్ద పరిచయం ఉందని ఎన్నికల సమయంలో వైసీపీ, టీడీపీ నేతలకు మోసగాడు గాలం వేశాడు.

ఈ రకంగా ఆశావహుల నుంచి లక్షలాది రూపాయలు దండుకున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలను విశాఖ పోలీస్ కమిషనర్ మహేశ్ చంద్ర లడ్హా మీడియాకు వివరించారు. నాటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యల ఫోన్ నెంబర్లు సంపాదించిన కేటుగాడు...ముఖ్యమంత్రి పీఏని అని చెప్పి పరిచయం చేసుకునేవాడు.

వారికి టిక్కెట్లు ఇప్పిస్తానని వల విసిరాడని సీపీ తెలిపారు. ఇందుకు సంబంధించి వైసీపీ నేత హర్షవర్థన్ రెడ్డి సైబరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని లడ్హా వెల్లడించారు.  

PREV
click me!

Recommended Stories

Jobs Notification 2026 : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. ఎగ్జామ్ లేకుండానే రూ.49,000 శాలరీ గవర్నమెంట్ జాబ్
IMD Rain Alert : అల్పపీడనం ఎఫెక్ట్ తో ఆగమాగం... ఇక్కడ ఏకంగా 46 మి.మీ వర్షమే..! ఇక అతలాకుతలమే