
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో విశాఖపట్నం అభివృద్ధి మరియు పర్యాటక రంగంపై ఎమ్మెల్యే, బీజేపీ విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన విశాఖపట్నంలో ఉన్న అపారమైన పర్యాటక అవకాశాలను ప్రస్తావిస్తూ, నగరాన్ని అంతర్జాతీయ స్థాయి టూరిజం హబ్గా అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని వివరించారు. రుషికొండ భవనాలు, వైజాగ్ ఫిల్మ్ నగర్ ఏర్పాటు, ఐబీవీ సెంచరీ క్లబ్కు సంబంధించిన అంశాలపై కూడా సభలో చర్చించారు.