విషాదం: క్వారీ గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి

Siva Kodati |  
Published : Oct 23, 2020, 04:23 PM IST
విషాదం: క్వారీ గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి

సారాంశం

విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెంలో నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెంలో నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. క్వారీ కోసం తవ్విన గుంతల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో స్నానాల కోసం దిగిన ముగ్గురు పిల్లలు మృతి చెందారు.

మృతులను బాలాజీ, శరత్, గిరీశ్‌గా గుర్తించారు. వీరు ముగ్గురు ఈత రాక మరణించినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్