సాంకేతిక సమస్యలు: ఏపీలో నిలిచిన భూముల రిజిస్ట్రేషన్లు

Published : May 29, 2023, 05:54 PM IST
సాంకేతిక  సమస్యలు:   ఏపీలో  నిలిచిన  భూముల రిజిస్ట్రేషన్లు

సారాంశం

ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో  రిజిస్ట్రేషన్ల  ప్రక్రియ  ఇవాళ  నిలిచిపోయింది.   సాంకేతిక  సమస్యతో   భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో  సాంకేతిక  సమస్యలతో  భూముల రిజిస్ట్రేసన్లు  నిలిచిపోయాయి.  భూముల  రిజిస్ట్రేషన్లు  నిలిచిపోవడంతో  అధికారులతో  రిజిస్ట్రేషన్ల  కోసం  వచ్చిన  వారు  వాగ్వాదానికి దిగారు.  ఇవాళ  ఉదయం  నుండి  రిజిస్ట్రేషన్  కార్యాలయాల్లోని  కంప్యూటర్లు   మొరాయించాయి. ఎప్పటివరకు  ఈ పరిస్థితి  ఎప్పుడు  మెరుగు కానుందో  కూడ  అధికారుల  నుండి  స్పష్టత  లేదని  రిజిస్ట్రేషన్ల  కోసం  కార్యాలయాలకు  వచ్చినవారంతా  చెబుతున్నారు. 

ఈ ఏడాది జూన్  1వ తేదీ నుండి ఏపీ రాష్ట్రంలో  భూముల ధరలు పెంచే అవకాశం ఉందని  ప్రచారం సాగుతుంది. దీంతో  రిజిస్ట్రేషన్ కార్యాలయాలు  కిక్కిరిసిపోయాయి.  రిజిస్ట్రేషన్ కార్యాలయంలో  కంప్యూటర్లు  మొరాయించడంతో  రిజిస్ట్రేషన్ల కోసం వెళ్లిన వారంతా  ఇబ్బంది పడుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan Health Update: చికిత్స కోసం ముంబై వెళ్లిన పవన్ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే?
Cyclone alert: బంగాళాఖాతంలో తుపాను..? ఈ జూలైలో జోరువానలు? | Heavy rains AP | Asianet News Telugu