టీడీపీ-వైసీపీ కార్యకర్తల ఘర్షణ: టీడీపీ మహిళా కార్యకర్త మృతి

By Siva KodatiFirst Published Jun 25, 2019, 9:25 AM IST
Highlights

ప్రకాశం జిల్లా చినగంజాం మండలం మోటుపల్లిలో టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో పద్మా అనే టీడీపీ కార్యకర్త మరణించింది.

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలుగుదేశం కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు.

తాజాగా ప్రకాశం జిల్లా చినగంజాం మండలం మోటుపల్లిలో టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో పద్మా అనే టీడీపీ కార్యకర్త మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. 

click me!