ఎమ్మెల్యే శ్రీదేవి క్రిస్టియన్, దళిత మహిళ అంటూ కుల రాజకీయాలా..?: చంద్రబాబు ఫైర్

Published : Sep 05, 2019, 09:15 PM ISTUpdated : Nov 19, 2019, 11:42 AM IST
ఎమ్మెల్యే శ్రీదేవి క్రిస్టియన్, దళిత మహిళ అంటూ కుల రాజకీయాలా..?: చంద్రబాబు ఫైర్

సారాంశం

వైసీపీలా కుల రాజకీయాలు చేయడం తమ సంస్కృతి కాదని స్పష్టం చేశారు. ఇకపోతే తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి విషయంలో వైసీపీ కావాలనే కుల చిచ్చు రాజేస్తోందని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.   

అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. వైసీపీ ప్రభుత్వానికి మత ఘర్షణలు సృష్టించడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం వైసీపీ సిద్ధాంతమని చంద్రబాబు నాయుడు విమర్శించారు. 

వైసీపీలా కుల రాజకీయాలు చేయడం తమ సంస్కృతి కాదని స్పష్టం చేశారు. ఇకపోతే తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి విషయంలో వైసీపీ కావాలనే కుల చిచ్చు రాజేస్తోందని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. 

ఉండవల్లి శ్రీదేవి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తాను క్రిస్టియన్ అని, తన భర్త కాపు కులస్థుడని స్పష్టం చేసినట్లు చెప్పుకొచ్చారు. వైసీపీ ఆమెను దళిత మహిళగా చూపి రాజకీయం చేస్తోందని విమర్శించారు. ఎస్సీలకు కేటాయించిన అసెంబ్లీ సీటు శ్రీదేవికి కట్టబెట్టి అన్యాయం చేసింది వైసీపీ  కాదా అని ఎస్సీలే నిలదీశారని చంద్రబాబు గుర్తు చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

మహానాడులో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | Chandrababu Naidu Powerful speech | Mahanaadu 2026 Day-1
Pawan Kalyan Powerful Speech: పవన్ పవర్ ఫుల్ స్పీచ్ కి జన సైనికులకి పూనకాలే | Asianet News Telugu