ఈ సోదరి ప్రశ్నకు సమాధానం చెబుతారా .. జగన్‌పై చంద్రబాబు ప్రశ్నల వర్షం

Siva Kodati |  
Published : May 01, 2022, 04:03 PM IST
ఈ సోదరి ప్రశ్నకు సమాధానం చెబుతారా .. జగన్‌పై చంద్రబాబు ప్రశ్నల వర్షం

సారాంశం

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ మేరకు పెంచిన విద్యుత్ ధరలు, పన్నుల భారంపై ప్రశ్నిస్తున్న ఓ మహిళ వీడియోను ఆయన ట్వీట్ చేశారు. 

పన్నుల బాదుడు, పెంచిన విద్యుత్ చార్జీలపై ఎమ్మెల్యేలను సైతం నిలదీస్తున్న మహిళల ధైర్యానికి వందనం అంటూ ప్రశంసించారు టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) . తమ జేబులు గుల్ల చేసిన డబ్బులతోనే సంక్షేమం అంటూ తమను మోసం చేస్తున్న వైనంపై గళమెత్తిన సోదరీమణుల ఆవేదనకు ప్రభుత్వం సమాధానం ఇవ్వగలదా? అని ఆయన నిలదీశారు. ఈ మేరకు ఆదివారం వరుస ట్వీట్లు చేశారు. 

‘‘ జగన్ (ys jagan) జేబు నుంచి ఇచ్చారా...అసలు దోచింది ఎంత? ఇచ్చింది ఎంత? మేము వాటితో బతుకుతున్నామా అంటోన్న ఆడబిడ్డల ప్రశ్నలకు ఈ ప్రభుత్వం ఏమి సమాధానం చెపుతుంది? ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని, తాము పడుతున్న కష్టాన్ని వివరిస్తూ ప్రశ్నించిన ఆ సోదరి తెగువ అందరికీ స్ఫూర్తి కావాలి’’.

‘‘ పన్నుల బాదుడు, పెంచిన కరెంట్ చార్జీల పై ఎమ్మెల్యేలను సైతం రోడ్డున నిలదీస్తున్న ఆ మహిళల ధైర్యానికి వందనం. తమ జేబులు గుల్ల చేసిన డబ్బులతోనే సంక్షేమం అంటూ తమను మోసం చేస్తున్న వైనం పై గళ మెత్తిన సోదరీమణుల ఆవేదనకు ప్రభుత్వం సమాధానం ఇవ్వగలదా? ’’ అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. 

 

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu