ఏపీ ఫైబర్‌నెట్ స్కాం : చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా.. ఎవ్వరూ మాట్లాడొద్దన్న సుప్రీం

Siva Kodati |  
Published : Dec 12, 2023, 02:39 PM IST
ఏపీ ఫైబర్‌నెట్ స్కాం : చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా.. ఎవ్వరూ మాట్లాడొద్దన్న సుప్రీం

సారాంశం

ఏపీ ఫైబర్‌నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు జనవరి 17కు వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ అనురుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.   

ఏపీ ఫైబర్‌నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు జనవరి 17కు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించిన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ప్రభుత్వానికి సుప్రీం సూచించింది. అలాగే కేసు విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని చంద్రబాబుకు కూడా సూచించింది. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ మేరకు జస్టిస్ అనురుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. 

కాగా.. ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై గత నెల 30 విచారణ జరిపిన ధర్మాసనం తదుపరి విచారణను డిసెంబర్ 12కు వాయిదా వేసింది. 17ఏ పై చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు పెండింగ్‌లో వున్నందున ఈ అంశంపై తీర్పు వచ్చాకే ఫైబర్‌నెట్ కేసులోనూ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారిస్తామని అప్పుడే స్పష్టం చేసింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rain Alert: ఎండల వేడికి బ్రేక్.. ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఐఎండీ కూల్ అప్‌డేట్
Jogi Ramesh vs Police: పారిపోతున్న జోగి రమేష్ వేటాడి పట్టుకున్న పోలీసులు| Asianet News Telugu