ప్రత్యూష భూముల వ్యవహారంలో స్టేటస్ కో... ఏపీ హైకోర్టు ఆదేశాలు

Arun Kumar P   | Asianet News
Published : Nov 17, 2020, 10:44 AM ISTUpdated : Nov 17, 2020, 10:56 AM IST
ప్రత్యూష భూముల వ్యవహారంలో స్టేటస్ కో... ఏపీ హైకోర్టు ఆదేశాలు

సారాంశం

విశాఖ జిల్లాలో తమకు చెందిన భూమి విషయంలో రెవెన్యూ అధికారుల జోక్యాన్ని నిలువరించాలని కోరుతూ ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్​ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది. 

అమరావతి: విశాఖపట్నంలోని అడివివరం - శొంఠ్యాం రహదారిలోని విజయరాంపురం అగ్రహారంలో ప్రత్యూష ఇన్ ఫ్రా సంస్థకు చెందిన 484 ఎకరాల విషయంలో యధాతథస్థితిని పాటించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది న్యాయస్థానం. 

విజయరాంపురం అగ్రహారంలో తమకు చెందిన భూమి విషయంలో రెవెన్యూ అధికారుల జోక్యాన్ని నిలువరించాలని కోరుతూ ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్​ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఆధీకృత అధికారి పీవీ ప్రభాకర్ ఆదివారం అత్యవసరంగా హైకోర్టులో హౌజ్​మోషన్​ పిటిషన్​ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ ప్రత్యూష ఇన్ ఫ్రా సంస్థకు చెందిన 484 ఎకరాల విషయంలో స్టేటస్ కో పాటించాలంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.

 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్