
నెల్లూరు : ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల పరిధిలోని ఓ గ్రామంలో ఆరేళ్ల చెవిటి, మూగ బాలికపై ఆమె మామ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం సాయంత్రం జరిగినప్పటికీ గురువారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది.
నిందితుడిని ఎస్ మాల్యాద్రి (27)గా గుర్తించారు.
స్థానిక దేవతా ఉత్సవానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు గ్రామానికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు బాధితురాలు, బాధితురాలి తల్లితో కలిసి బైక్పై కిరాణా సామాను కొనుగోలు చేసేందుకు సమీపంలోని గ్రామానికి వెళ్లారు.
బాధితురాలి తల్లి కొనుగోళ్లలో నిమగ్నమై ఉండగా, నిందితుడు బాలికను చాక్లెట్ కొనిపిస్తానని ఆశ చూపించి పిలిచాడు. ఆ తరువాత తన బైక్పై నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి బుధవారం సాయంత్రం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బాలిక కనిపించకపోవడంతో కోసం కుటుంబ సభ్యులు వెతకుతుండగా.. బాలికతో పాటు నిందితుడుగ్రామానికి వచ్చాడు. అత్యాచార ఘటన చిన్నారిపై తీవ్ర ప్రభావం చూపించింది. మాటలు రాని ఆ చిన్నారి కన్నీళ్లతో తల్లిని గట్టిగా కౌగిలించుకుని, వణికిపోయింది.
ఎక్కడికి వెళ్లావని తల్లి అడిగితే... సంకేత భాషతో తనపై జరిగిన దారుణాన్ని వివరించింది. దీంతోపాటు బాలిక ప్రైవేట్ పార్ట్ నుంచి రక్తం కారడాన్ని బాధితురాలి తల్లి గమనించింది. వెంటనే పోలీసులను ఆశ్రయించింది.
దీనిమీద పోలీసు అధికారులు మాట్లాడుతూ.. “నిందితుడిపై ఐపీసీ, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసాం. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చాం’’ అని తెలిపారు.
ఎన్నికలకు ముందు జగన్ కీలక నిర్ణయం... అన్ని జిల్లాలకు నూతన అధ్యక్షులు... లిస్ట్ ఇదే..
ఇదిలా ఉండగా, హైదరాబాదులో ఆగస్ట్ 19 న ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. చెవిటి, మూగ మహిళలపై ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. అదను చూసి ఇంట్లోకి వచ్చిన ఎదురింటి యువకుడు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చెవిటి, మూగ మహిళ అని తెలిసి.. ఆమెను బాత్రూంలో బంధించి మరీ దారుణంగా అత్యాచారం చేశాడు.
ఈ ఘటన హైదరాబాదులోని హుమాయున్ నగర్ పిఎస్ పరిధిలో చోటుచేసుకుంది. బాధిత మహిళా భర్త కూడా దివ్యాంగుడే. ఈ దంపతులిద్దరూ అతని తల్లితో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. భర్త తల్లిని తీసుకుని బయటకు వెళ్లిన సమయం చూసి ఇంట్లోకి చొరబడ్డ ఎదురింటి యువకుడు సాయి ఈ ఘాతకానికి తెగించాడు.
బాధితురాలు మూగ కావడంతో తనమీద దాష్టీకం జరుగుతున్న సమయంలో అరవలేకపోయింది. సాయి ఆ మహిళ మీద అత్యాచారం చేసిన తర్వాత ఆమెను బాత్రూంలోనే ఉంచి గడియ పెట్టి వెళ్లిపోయాడు. తల్లితో బయటికి వెళ్లిన భర్త ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత గమనించి గడియతీసాడు. ఏం జరిగిందని ఆరా తీయగా జరిగిన దారుణాన్ని వివరించిందామె.
వెంటనే ఈ ఘటన మీద హుమాయూన్ నగర్ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాయిని అరెస్టు చేశారు. గతంలో కూడా అతని వేధింపులు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు.
(లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బాధితురాలి గుర్తింపు ఆమె గోప్యతను కాపాడేందుకు బహిర్గతం చేయబడలేదు)