తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం: ఆరుగురికి గాయాలు

By narsimha lodeFirst Published May 24, 2023, 2:50 PM IST
Highlights

తిరుమల ఘాట్ రోడ్డులో  ఇవాళ  జరిగిన  రోడ్డు ప్రమాదంలో  ఆరుగురు గాయపడ్డారు. సంఘటన స్థలంలో  ఎస్పీఎఫ్  సిబ్బంది  సహాయక  చర్యలు చేపట్టారు. 


తిరుమల: తిరుమల ఘాట్ రోడ్డులో  బుధవారంనాడు  రోడ్డు ప్రమాదం  చోటు  చేసుకుంది.  తిరుమల నుండి తిరుపతికి  ఎలక్ట్రిక్  బస్సు వెళ్లున్ సమయంలో  ప్రమాదం  జరిగింది.  ఘాట్  రోడ్డులో  డివైడర్ ను ఢీకొని  బస్సు  బోల్తా పడింది. 

ఈ ప్రమాదంలో  ఆరుగురు   భక్తులకు  గాయాలయ్యాయి.  గాయపడిన భక్తులను  రుయా ఆసుపత్రికి తరలించార. మరో వైపు  సంఘటన స్థలంలో  ఎస్‌పీఎఫ్ సిబ్బంది  సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం  జరిగిన సమయంలో  బస్సులో  29 మంది  ప్రయాణీకులున్నారు.

గతంలో  కూడ  తిరుమల ఘాట్  రోడ్డులో  ప్రమాదాలు  చోటు  చేసుకున్నాయి. ఈ నెల  14న  తిరుమల ఘాట్  రోడ్డులో  జరిగిన  ప్రమాదంలో  ఇద్దరు మృతి చెందారు.  మరో 15 మంది గాయపడ్డారు.అనంతపురానికి  చెందిన  భక్తులు వాహనంలో  తిరుమల ఘాట్  రోడ్డు నుండి  తిరిగి వస్తున్న సమయంలో  ఈ ప్రమాదం  జరిగింది.  స్పీడ్ గా  ఉన్న  వాహనం  అదుపు తప్పింది.  ఈ ప్రమాదం లో  వాహనంలో  ఇద్దరు మృతి చెందారు. మరో  15 మంది గాయపడ్డారు. ఈ ఏడాది ఏప్రిల్  23న జరిగిన  రోడ్డు ప్రమాదంలో  ఆరుగరు  ప్రయాణీకులు గాయపడ్డారు.   ఈ ఏడాది మార్చి మాసంలో  జరిగిన  రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భక్తులు గాయపడ్డారు.

click me!