ప.గో. లో ఘోర ప్రమాదం: ఆరుగురు మృతి, మరో ఐదుగురి పరిస్థితి విషమం

Published : Sep 20, 2019, 01:21 PM ISTUpdated : Sep 20, 2019, 01:22 PM IST
ప.గో. లో ఘోర ప్రమాదం: ఆరుగురు మృతి, మరో ఐదుగురి పరిస్థితి విషమం

సారాంశం

పశ్చిమ గోదావరి జిల్లాలో శుక్రవారం నాడు ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో ఒకే కుటుంబంలోని ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల వద్ద శుక్రవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు.

విశాఖ జిల్లా పెందుర్తి మండలం రామాపురం గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 11 మంది తిరుపతిలో శ్రీవారిని దర్శించుకొని వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది.

పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల వద్ద వీరు ప్రయాణీస్తున్న వ్యాన్ ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య ఆరుకు చేరుకొంది.

క్షతగాత్రుల్లో ఐదుగురిలో ముగ్గురి పరిస్థితి కూడ విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మెరుగైన చికిత్స కోసం వారిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : మళ్లీ వర్షాలు... ఈసారి ఫిబ్రవరిలో కంటే భారీగా, బిఅలర్ట్
Andhra Pradesh Legislative Council: తిరుమల నెయ్యి కల్తీ పైఅసెంబ్లీ లో రచ్చ రచ్చ | Asianet Telugu