శ్రీకాకుళం జిల్లాలో విషాదం: భార్యను హత్య చేసి భర్త సూసైడ్

Published : Nov 13, 2022, 12:42 PM IST
శ్రీకాకుళం జిల్లాలో విషాదం: భార్యను  హత్య చేసి భర్త సూసైడ్

సారాంశం

శ్రీకాకుళం జిల్లాలోని జగన్నాథపురంలో కుటుంబ కలహల  నేపథ్యంలో భార్యనుహత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటనపై పోలీసులు కేసు  నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

శ్రీకాకుళం:జిల్లాలోని సంతబొమ్మాళి మండలంలో కుటుంబ కలహలతో భార్యను హత్య చేసి  భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. సంతబొమ్మాళి మండలంలోని జగన్నాథపురంలో  దాసరి సింహద్రి తన భార్య  ఉమను హత్యచేసిన తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గ్రామంలో విషాదా,న్ని నింపింది. ఈ విషయమై అందిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.ఈ ఘటనకు  సంబంధించిన  వివరాలను సేకరిస్తున్నారు. మృతుల  బంధువులు, స్థానికుల నుండి సమాచారాన్ని సేకరిస్తున్నారు. భార్యను హత్య చేసి తాను చావాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయనే విషయమై అర్ధం  కావడం లేదోనని   సింహద్రి బంధువులు చెబుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

మారనున్న తిరుమల రూపురేఖలు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం | CM Chandrababu Naidu Tirumala Visite
Tirumala : శ్రీవారి భక్తులను గుడ్ న్యూస్.. అందుబాటులోకి 32 EV బస్సులు, ఇకపై ఫ్రీ జర్నీ