శిల్పను అలా అంటారా, లోకేష్ ఎందుకు పరామర్శించలేదు: రోజా

Published : Aug 10, 2018, 10:26 PM ISTUpdated : Sep 09, 2018, 02:01 PM IST
శిల్పను అలా అంటారా, లోకేష్ ఎందుకు పరామర్శించలేదు: రోజా

సారాంశం

డాక్టర్ శిల్ప ఆత్మహత్య ఘటనపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా స్పందించారు. శిల్పను సైకో అనడం దారుణమని ఆమె అన్నారు. శిల్పది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్యేనని ఆమె విమర్శించారు. 

తిరుపతి: డాక్టర్ శిల్ప ఆత్మహత్య ఘటనపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా స్పందించారు. శిల్పను సైకో అనడం దారుణమని ఆమె అన్నారు. శిల్పది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్యేనని ఆమె విమర్శించారు. 

శిల్ప కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేశ్ సహా ఎవరూ ఇంతవరకూ పరామర్శించలేదన్నారు. చదువుకునే మహిళలకు కూడా టీడీపీ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందని ఆమె అన్నారు.
 
తాను శిల్పా కుటుంబ సభ్యులను పరామర్శించానని, అయితే ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె అన్నారు. గవర్నర్‌కు లేఖ రాసిందన్న కోపంతోనే ప్రొఫెసర్లు మెడికో శిల్పపై కక్ష కట్టారని ఆమె ఆరోపించారు. 

ప్రభుత్వం ప్రొఫెసర్లను కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆమె విమర్శించారు. శిల్ప ఆత్మహత్యకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.

PREV
click me!

Recommended Stories

బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు..ఏపీలో వర్షాలు స్టార్ట్ | Asianet News Telugu
Weather Update : బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. మరి వర్షాలు ఎక్కడ? ఎప్పట్నుంచి కురుస్తాయి?