వెయ్యి కాళ్ల మండంపై హైకోర్టులో రోజా పిటిషన్

By ramya neerukondaFirst Published Sep 1, 2018, 11:25 AM IST
Highlights

 తిరుమలలో వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చివేయడం దారుణం అన్నారు.
 

తిరుమలలో వెయ్యి కాళ్ల మండపాన్ని మళ్లీ నిర్మించాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. మండపాన్ని కూల్చివేయడంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చివేయడం దారుణం అన్నారు.

 విషయాన్ని చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని ఆరోపించారు. ప్రజల మనోభావాలని దెబ్బతీసేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే వెయ్యికాళ్ల మండపాన్ని తిరిగి నిర్మిస్తామని హామి ఇచ్చారు.

click me!