తిరుపతి-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌లో రెచ్చిపోయిన దొంగలు..

Published : May 20, 2023, 10:46 AM IST
తిరుపతి-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌లో రెచ్చిపోయిన దొంగలు..

సారాంశం

తిరుపతి-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు రెచ్చిపోయారు. మార్గమధ్యలో దోపిడీకి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

కడప: తిరుపతి-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు రెచ్చిపోయారు. మార్గమధ్యలో దోపిడీకి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. తిరుపతి-గుంటూరు ఎక్స్‌ప్రెస్ రాత్రి 730 గంటల సమయంలో తిరుపతి నుంచి బయలుదేరాల్సి ఉంది. కానీ దాదాపు గంట ఆలస్యంగా అక్కడి నుంచి రైలు కదిలింది. అయితే కమలాపురం రైలు నిలయం దాటిన తర్వాత రైలు ఆగింది. అప్పుడు 20 నుంచి 25 మంది దొంగలు ట్రైన్‌లో ఎక్కినట్టుగా చెబుతున్నారు.. ఎస్‌1 నుంచి ఎస్‌6 వరకు ఉన్న బోగీల్లో పలువురు ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేశారు. 

అయితే దోపిడీని ప్రతిఘటించేందుకు యత్నించినవారిపై దాడికి కూడా పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రొద్దుటూరులో పోలీసులు బోగీల్లో బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్నట్లు తెలుస్తోంది. రాత్రిపూట  రైళ్లలో భద్రత పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Holidays : ఈ వీక్ లో ఇంకా ఒక్కటే వర్కింగ్ డే.. మిగతా వారమంతా సెలవులే.. నెక్ట్స్ మండే వరకు ఎంజాయ్
Kandula Durgesh Pressmeet: వైసీపీ నేతలకు కందుల దుర్గేష్ స్ట్రాంగ్ వార్నింగ్ | Asianet News Telugu