
కోనసీమ : ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. టాటామ్యాజిక్ వాహనాన్ని వేగంగా దూసుకువచ్చిన కారు ఢీ కొట్టింది. అలమూరు మండలం అడికి దగ్గర జాతీయ రహదారి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 9మందికి గాయాలయ్యాయి. కొత్తపల్లి మండలంలో దైవరద్శనానకి వెళ్లివస్తుండగా ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.