విశాఖలో గర్భిణీపై దాడి: ఆసుపత్రిలో చికిత్స

Published : Apr 17, 2019, 01:47 PM IST
విశాఖలో గర్భిణీపై దాడి: ఆసుపత్రిలో చికిత్స

సారాంశం

విశాఖపట్టణం జిల్లాలో రాజేశ్వరీ అనే వివాహితను అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఆరోపిస్తోంది. 


విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లాలో రాజేశ్వరీ అనే వివాహితను అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఆరోపిస్తోంది. ఆమెను కారులో ఆసుపత్రికి తరలిస్తూ దాడికి పాల్పడ్డారని బాధితురాలు  చెబుతోంది.

విశాఖ జిల్లాకు చెందిన పెందుర్తిలో రాజేశ్వరీ అనే వివాహితను అదనపు కట్నం కోసం భర్త, అత్త వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.  రూ. 25 లక్షలు అదనపు కట్నం తీసుకురావాలని చెప్పి వేధింపులకు పాల్పడేవారని ఆరోపణలు చేస్తోంది.

ఆసుపత్రికి తీసుకెళ్తామని చెప్పి కారులోనే గర్భిణీపై దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తోంది. రాజేశ్వరీ చేతిపై కోశారని చెబుతుంది. స్థానికుల సహాయంతో భర్త నుండి తప్పించుకొంది.  బాధితురాలు కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే