రాజానగరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

Published : Mar 13, 2024, 08:52 PM ISTUpdated : Mar 13, 2024, 08:56 PM IST
రాజానగరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

సారాంశం

తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా జక్కంపూడి రాజా కొనసాగుతున్నారు. వరుసగా రెండుసార్లు (2009, 2014) ప్రాతినిధ్యం వహించిన పెందుర్తి వెంకటేష్ ను ఓడించారు జక్కంపూడి. ఇలా వైసిపి, టిడిపి నువ్వా నేనా అన్నట్లున్న రాజానగరం రాజకీయాల్లోకి జనసేన ఎంటర్ అయ్యింది. పొత్తులో భాగంగా ఈసారి రాజానగరం  బరిలో జనసేన నిలిచింది. 

రాజానగరం రాజకీయాలు : 

2008 లో చేపట్టిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాజానగరం అసెంబ్లీ ఎర్పాటయ్యింది. ఈ నియోజకవర్గంలో 2009లో మొదటిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా టిడిపి విజయం సాధించింది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత 2014 లో జరిగిన ఎన్నికల్లోనూ టిడిపి సత్తా చాటింది.  వరుసగా రెండుసార్లు పెందుర్తి వెంకటేష్ ఎమ్మెల్యేగా గెలిచారు. 

ఇలా టిడిపి బలంగా వున్న రాజానగరంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి జెండా ఎగిరింది. 2019 ఎన్నికల్లో జక్కంపూడి రాజా రాజానగరం ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఐదేళ్లలో వైసిపి కూడా రాజానగరంలో బలంగా మారింది. కాబట్టి  ఈసారి కూడా ఇక్కడ హోరాహోరీ పోరు సాగనుంది. 

రాజానగరం నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. సీతానగరం  
2. కోరుకొండ 
3. రాజానగరం 

రాజానగరం అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) ‌-  2,01,260

పురుషులు -  99,943
మహిళలు ‌-   1,01,309

రాజానగరం అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

రాజానగరం అసెంబ్లీ బరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నిలిచే అవకాశాలున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని వైసిపి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 

జనసేన అభ్యర్థి :

టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ రాజానగరంలో పోటీ చేస్తున్నారు. పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు దక్కింది.

రాజానగరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ;
 
రాజానగరం అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,76,785

వైసిపి - జక్కంపూడి రాజా - 90,680 (51 శాతం) ‌ - 31,772 ఓట్ల మెజారిటీతో ఘన విజయం

టిడిపి - పెందుర్తి వెంకటేష్  - 58,908 (33 శాతం) - ఓటమి 

జనసేన పార్టీ - రాయపురెడ్డి ప్రసాద్ ‌- 20,847 (11 శాతం) 

రాజానగరం అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు -   1,60,757 (85 శాతం)

టిడిపి  - పెందుర్తి వెంకటేష్ - 81,476 (50 శాతం) - 8,887 ఓట్ల మెజారిటీతో విజయం

వైసిపి - జె విజయలక్ష్మి - 82,589 (45 శాతం) - ఓటమి


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్