జగన్ నివాసం ఎదుట మాజీ డీజీపీ ఠాకూర్‌కు వ్యతిరేకంగా ఆందోళన

Published : Jul 09, 2019, 10:51 AM IST
జగన్ నివాసం ఎదుట  మాజీ డీజీపీ ఠాకూర్‌కు వ్యతిరేకంగా ఆందోళన

సారాంశం

మాజీ డీజీపీ ఏఆర్ ఠాకూర్‌కు వ్యతిరేకంగా సీఎం జగన్ నివాసం వద్ద కొందరు ఆందోళనకు దిగారు. మాజీ సీఎం చంద్రబాబు మెప్పు కోసం తమపై తప్పుడు కేసులు బనాయించారని బాధితులు ఆరోపిస్తున్నారు.

అమరావతి: మాజీ డీజీపీ ఏఆర్ ఠాకూర్‌కు వ్యతిరేకంగా సీఎం జగన్ నివాసం వద్ద కొందరు ఆందోళనకు దిగారు. మాజీ సీఎం చంద్రబాబు మెప్పు కోసం తమపై తప్పుడు కేసులు బనాయించారని బాధితులు ఆరోపిస్తున్నారు.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  ఆయన మెప్పు కోసం డీజపీ తప్పుడు కేసులు బనాయించారని ఆరోపిస్తున్నారు.తప్పుడు కేసులతో తమను ఇబ్బందులకు గురి చేశారని  బాధితులు ఫ్లెక్సీలను ప్రదర్శించారు.ఏసీబీలో ఇంకా ఠాకూర్ హవా కొనసాగుతోందని  నిరసనకారరులు ఆరోపిస్తున్నారు.

తమపై బనాయించిన కేసులను ఎత్తివేయాలని  బాధితులు డిమాండ్ చేశారు. తప్పుడు కేసులు బనాయించిన మాజీ డీజీపీ ఠాకూర్‌పై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Jobs Notification 2026 : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. ఎగ్జామ్ లేకుండానే రూ.49,000 శాలరీ గవర్నమెంట్ జాబ్
IMD Rain Alert : అల్పపీడనం ఎఫెక్ట్ తో ఆగమాగం... ఇక్కడ ఏకంగా 46 మి.మీ వర్షమే..! ఇక అతలాకుతలమే