తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ లో పార్లమెంట్ తో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి.ఈ క్రమంలోనే ఇవాళ ఇరురాష్ట్రాల ప్రజలు ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు.

10:38 PM (IST) May 13
ఏపీలోని కడప జిల్లా జమ్మలమడుగు లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ ముగుస్తున్న సమయంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పట్టణ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో పోలింగ్ బూత్ 116, 117 లో బిజెపి, వైసిపి వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి వాహన అద్దాలను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది.
06:02 PM (IST) May 13
అల్లూరి సీతారామరాజు – 55.17
అనకాపల్లి – 65.97
అనంతపురం – 68.04
అన్నమయ్య – 67.63
బాపట్ల 72.14
చిత్తూరు – 74.06
అంబేద్కర్ కోనసీమ -73.55
ఈస్ట్ గోదావరి – 67.93
ఏలూరు – 71.10
గుంటూరు – 65.58
కాకినాడ – 65.01
కృష్ణ జిల్లా – 73.53
కర్నూలు – 64.55
నంద్యాల – 71.43
ఎన్టీఆర్ జిల్లా – 67.44
పల్నాడు – 69.10
పార్వతీపురం మన్యం – 61.18
ప్రకాశం – 71.00
నెల్లూరు – 69.95
సత్యసాయి జిల్లా – 67.16
శ్రీకాకుళం – 67.48
తిరుపతి – 65.88
విశాఖ – 57.42
విజయనగరం – 68.16
పశ్చిమ గోదావరి – 68.98
వైయస్ఆర్ జిల్లా – 72.85
05:50 PM (IST) May 13
తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు 61. 16 శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఏపీలో పలు చోట్ల చెదురుముదురు ఘటనలు జరిగాయి. కాగా.. సాయంత్రం 5 గంటల వరకు 68 శాతం పోలింగ్ నమోదు.
05:32 PM (IST) May 13
ఏపీలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలోని బ్రాహ్మణ కాలువలో వైసీపీ, టీడీపీ మధ్య ఉద్రికత్త వాతావరణం చోటుచేసుకుంది. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ టీడీపీ, వైసీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలో పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి బీఎస్ఎఫ్ జవాన్లు గాల్లోకి కాల్పులు జరిపారు.
05:05 PM (IST) May 13
ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్ ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. ఈ దాడిలో ఆయన కార్లను ధ్వంసం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు.
04:44 PM (IST) May 13
ఏపీలో పలుచోట్ల హింస్మాత సంఘటనలు జరిగాయి. ప్రకాశం జిల్లా దర్శిలోని మండల పరిషత్ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేశారు. దీంతో పోలింగ్ నిలిచిపోగా.. సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
04:09 PM (IST) May 13
- అరుకు, రంపచోడవరం, పాడేరు
04:06 PM (IST) May 13
తెలంగాణ లో 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్
సిర్పూర్,
ఆసిఫాబాద్,
బెల్లంపల్లి,
చెన్నూరు,
మంచిర్యాల,
మంథని,
భూపాలపల్లి,
ములుగు,
పినపాక,
ఇల్లెందు,
కొత్తగూడెం,
అశ్వారావుపేట,
భద్రాచలం నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరిగింది.
-- 9,900 సమస్యాత్మక ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్
- క్యూలో ఉన్నవారికే అవకాశం
04:01 PM (IST) May 13
ఆదిలాబాద్ - 62.44 శాతం,
భువనగిరి - 62.05 శాతం,
చేవెళ్ల - 42.35 శాతం,
హైదరాబాద్- 29.47శాతం,
కరీంనగర్ - 58.24 శాతం,
ఖమ్మం - 63.67 శాతం,
మహబూబాబాద్ - 61.40 శాతం,
మహబూబ్నగర్ - 58.92 శాతం,
మల్కాజ్గిరి - 37.69 శాతం,
మెదక్- 60.94 శాతం,
నాగర్కర్నూల్- 57.17 శాతం,
నల్లగొండ - 59.91 శాతం,
నిజామాబాద్లో 58.70 శాతం,
పెద్దపల్లి- 55.92 శాతం,
సికింద్రాబాద్- 35.48 శాతం,
వరంగల్ - 54.17 శాతం,
జహీరాబాద్ - 63.96 శాతం .
03:40 PM (IST) May 13
తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల సమయానికి పోలింగ్ 52.30 శాతం మార్కు దాటింది.ఈ సారి రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం నమోదవ్వొచ్చనే ఎన్నికల సంఘం అధికారులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో అత్యధికంగా జహీరాబాద్లో 63.94 శాతం పోలింగ్ కాగా, మెదక్లో 60.94 శాతం, వరంగల్లో 54.17 శాతం, ఖమ్మంలో 63.67 శాతం పోలింగ్ నమోదు
03:32 PM (IST) May 13
ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్నం 3 గంటల సమయానికి పోలింగ్ 52 శాతం మార్కు దాటింది. ఈసారి రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం నమోదవ్వొచ్చనే ఎన్నికల అధికారులు భావిస్తున్నారు.
03:23 PM (IST) May 13
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పోలింగ్
1 గంట వరకు 40.38శాతం పోలింగ్
ఆదిలాబాద్ -50.18 శాతం
భువనగిరి -46.49 శాతం
చేవెళ్ల -34.56 శాతం
హైద్రాబాద్ -19.37 శాతం
కరీంనగర్-45.11 శాతం
ఖమ్మం-50.63 శాతం
మహబూబాబాద్-48.81 శాతం
మహబూబ్నగర్-45.84 శాతం
మల్కాజిగిరి-27.69 శాతం
మెదక్-46.72 శాతం
నాగర్ కర్నూల్ -45.88 శాతం
నల్గొండ-48.48 శాతం
నిజామాబాద్-45.67 శాతం
పెద్దపల్లి-44.87 శాతం
సికింద్రబాద్-24.91 శాతం
వరంగల్-41.23 శాతం
జహీరాబాద్-50.71 శాతం
02:43 PM (IST) May 13
బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు అయ్యింది. పోలింగ్ సందర్భంగా ప్రిసైడింగ్ అధికారితో దురుసుగా ప్రవర్తించినందుకు అతడిపై మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇక హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కూడా మలక్ పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది.
01:30 PM (IST) May 13
తెలంగాణలో ఒంటిగంట వరకు 40 శాతం పోలింగ్ నమోదయ్యింది. 36 శాతంమంది మహిళలు, 35 శాతం మంది పురుషులు ఓటేసారు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా 40 శాతం పోలింగ్ నమోదయ్యింది.
12:30 PM (IST) May 13
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఓటేసారు. భార్య కూతురితో కలిసివెళ్లి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇక ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఓటుహక్కును వినియోగించుకున్నారు.
12:12 PM (IST) May 13
తెలంగాణ మాజీ సీఎం, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని తన స్వగ్రామంలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. చింతమడక పోలింగ్ బూత్ కు భార్య శోభతో కలిసివచ్చి ఓటేసారు కేసీఆర్. అయితే కేసీఆర్ తనయుడు కేటీఆర్ కుటుంబం మాత్రం హైదరాబాద్ లో ఓటేసింది. కేసీఆర్ మనవడు హిమాన్షు మొదటిసారి ఓటేసాడు.
12:06 PM (IST) May 13
హైదరాబాద్ లో సినీప నటులు మంచు లక్ష్మి, మంచు మనోజ్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఓటేయడానికి బద్దకిస్తున్న హైదరాబాదీలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. తాను ఓటేయడానికే ముంబై నుండి హైదరాబాద్ వచ్చాను... కానీ ఇక్కడే వున్నవారు ఇళ్లలోంచి కూడా బయటకు రాకపోవడం దారుణమని మంచు లక్ష్మి ఆందోళన వ్యక్తం చేసారు.
11:39 AM (IST) May 13
తెలంగాణలో ఉదయం 11 గంటల వరకు 24.25 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా 24 శాతం పోలింగ్ నమోదయ్యింది.
11:37 AM (IST) May 13
మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేటలో హరీష్, హైదరాబాద్ నందినగర్ లో కేటీఆర్ ఓటేసారు. మంత్రి సీతక్క కూడా ఓటుహక్కును వినియోగించుకున్నారు.
11:15 AM (IST) May 13
తెనాలిలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.స్థానిక ఎమ్మెల్యే ఓ ఓటర్ పై చేయిచేసుకోగా... ఆ ఓటర్ కూడా ఎమ్మెల్యే చెంపపై కొట్టాడు. దీంతో ఎమ్మెల్యే అనుచరులంతాసదరు ఓటర్ పై దాడికి దిగారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డారు.
11:01 AM (IST) May 13
హిందూపురంలో నందమూరి బాలకృష్ణ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
10:47 AM (IST) May 13
సినీ హీరో బాలకృష్ణ పోటీచేస్తున్న హిందూపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చిలమత్తూరు వైసిపి ఎంపిపిపై టిడిపి శ్రేణులు దాడికి దిగాయి. ఈ ఘటనలో పలువురు వైసిపి నేతలు గాయపడగా వాహనాలు ధ్వంసమయ్యాయి.
10:30 AM (IST) May 13
చేవెళ్ల, మల్కాజ్ గిరి బిజెపి అభ్యర్థలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్ లు కుటుంబసమేతంగా వెళ్లి ఓటుహక్కును వినియోగించుకున్నారు.
10:06 AM (IST) May 13
హైదరాబాద్ లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి, కరీంనగర్ లో బిజెపి నేత బండి సంజయ్ కుటుంబసమేతంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటుహక్కును వినియోగించుకున్నారు.
09:36 AM (IST) May 13
ఆంధ్ర ప్రదేశ్ లో ఉదయం 9 గంటల వరకు 10 శాతం పోలింగ్ నమోదయ్యింది.
09:30 AM (IST) May 13
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో పోలింగ్ ప్రారంభమై రెండు గంటలు గడుస్తున్నా ఎక్కువగా ఓటింగ్ శాతం నమోదు కాలేదు. ఉదయం 9 గంటల వరకు కేవలం 9.51 శాతం పోలింగ్ మాత్రమే నమోదయ్యింది
09:12 AM (IST) May 13
09:10 AM (IST) May 13
భర్త చంద్రబాబుతో కలిసివచ్చి ఓటుహక్కును వినియోగించుకున్నారు నారా భువనేశ్వరి. అనంతరం ఆమె రాష్ట్రంలోని మహిళలంతా ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు.
09:04 AM (IST) May 13
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మంగళగిరిలోకి లక్ష్మీనరసింహ స్వామి కాలనీ పోలింగ్ బూత్ లో ఆయన ఓటేసారు. భార్యతో కలిసివచ్చి ఓటేసారు.
08:59 AM (IST) May 13
నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కొండాయపాలెం పోలింగ్ కేంద్రంలో వైసిపి నేత విజయసాయిరెడ్డి ఓటుహక్కను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజాస్వామ్యానికి పండుగ రోజయిన ఇవాళ ప్రజలంతా ఓటు వేసి మీ బాధ్యతను నిర్వర్తించాలని విజయసాయి కోరారు.
08:49 AM (IST) May 13
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసింది. ఓటు వేసాక మోడీ పేరు ప్రస్తావించడం ద్వారా కిషన్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించాడని సీఈవోకు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది.
08:25 AM (IST) May 13
మాచర్ల నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో రెంటాల గ్రామంలో పోలింగ్ కాస్త ఆలస్యంగా మొదలయ్యింది. అయితే పోలీసులు భారీగా మొహరించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
08:22 AM (IST) May 13
మహబూబ్ నగర్ లోక్ సభ అభ్యర్థులు డికె అరుణ, వంశీచంద్ రెడ్డి ఓటుహక్కును వినియోగించుకున్నారు.
08:13 AM (IST) May 13
మెగాస్టార్ చిరంజీవి క్యూలైన్ లో నిలబడి ఓటుహక్కును వినియోగించుకోడానికి ఎదురుచూస్తున్నారు. భార్య సురేఖతో కలిసి ఆయన ఓటు వేసేందుకు వచ్చారు.
08:07 AM (IST) May 13
కేంద్ర మంత్రి, తెలంగాణ బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి కాచీగూడలో ఓటుహక్కును వినియోగించుకున్నారు.సికింద్రాబాద్ లోక్ సభ పరిధిలోని కాచిగూడలో దీక్ష మోడల్ స్కూల్ లో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ కు కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసిన ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
08:04 AM (IST) May 13
తెలంగాణ మజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా భార్య భువనేశ్వరితో కలిసి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని ఓ పోలింగ్ కేంద్రంలో చంద్రబాబు దంపతులు ఓటేసారు. ఇక మంగళగిరిలో నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు ఓటేసారు.
07:44 AM (IST) May 13
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటుహక్కును వినియోగించుకున్నారు. తన సొంత జిల్లా కడపలోని పులివెందులలోని బాకరాపురం పోలింగ్ కేంద్రంలో జగన్ ఓటేసారు. ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా ఓటేసారు.
07:35 AM (IST) May 13
హైదరాబాద్ లోక్ సభ బిజెపి అభ్యర్థి మాధవీ లత ఓటుహక్కును వినియోగించుకున్నారు.
07:31 AM (IST) May 13
ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవిఎంలు మొరాయిస్తున్నాయి. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ పరిధిలోని సీతారామపురంలో ఈవీఎంలు పనిచేయడం లేదు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో కూడా ఈవీఎంల సమస్య బయటపడింది.
07:27 AM (IST) May 13
సినీ నటులు అల్లు అర్జున్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూ. ఎన్టీఆర్ కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు తల్లి, భార్యతో కలిసివచ్చారు. పోలింగ్ బూత్ వద్దక్యూలైన్ లో నిలబడి ఓటేసేందుకు ఎదురు చూస్తున్నారు.