పెథాయ్ తుఫాను ప్రభావం.. యానాంలో భారీ వర్షం

Published : Dec 17, 2018, 10:20 AM IST
పెథాయ్ తుఫాను ప్రభావం.. యానాంలో భారీ వర్షం

సారాంశం

పెథాయ్ తుఫాను ప్రభావం కోస్తా జిల్లాలోపై తీవ్రంగా చూపిస్తోంది. ఈ ప్రభావం కారణంగా తూర్పుగోదావరి జిల్లా యానాంలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. 

పెథాయ్ తుఫాను ప్రభావం కోస్తా జిల్లాలోపై తీవ్రంగా చూపిస్తోంది. ఈ ప్రభావం కారణంగా తూర్పుగోదావరి జిల్లా యానాంలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇప్పటికే  అధికారులు.. అప్రమత్తమై తగు చర్యలు చేపడుతున్నారు. పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవలు ప్రకటించారు.

భారీ వర్షాలకు చెట్లు విరిగిపడి విద్యుత్ సరఫరా చాలా ప్రాంతాల్లో నిలిచిపోయింది. తీర ప్రాంతాల్లో పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు పర్యటించారు. పునరావాస కేంద్రాల్లో ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. మరోవైపు తుఫాను సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు పుదుచ్చేరి నుంచి ఇద్దరు ఐఏఎస్ అధికారులు యానాంకు వచ్చారు. కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి పరిస్థిని సమీక్షిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

AP & Telangana Weather Update: రానున్న 24 గంటల్లో ఈ జిల్లాలకు అలెర్ట్ | Asianet News Telugu
MSME Growth Summit 2026: MSME గ్రోత్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు కీలక ఒప్పందం | Asianet News Telugu