జగన్ పై దాడి ఘటనలో టీడీపీ వెకిలి వేషాలు:పవన్ కళ్యాణ్

By Nagaraju TFirst Published Nov 2, 2018, 5:02 PM IST
Highlights

ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై దాడి జరగడం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడ నుంచి తుని వరకు రైలు యాత్ర చేపట్టిన పవన్ ఏలూరులో కార్మికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ పై దాడిని ప్రతీ ఒక్కరూ ఖండించాలన్నారు. దాడి ఘటనపై ప్రభుత్వం వెకిలిగా మాట్లాడటం తగదని హితవు పలికారు. 

ఏలూరు:ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై దాడి జరగడం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడ నుంచి తుని వరకు రైలు యాత్ర చేపట్టిన పవన్ ఏలూరులో కార్మికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ పై దాడిని ప్రతీ ఒక్కరూ ఖండించాలన్నారు. దాడి ఘటనపై ప్రభుత్వం వెకిలిగా మాట్లాడటం తగదని హితవు పలికారు. 

జగన్ పై దాడి ఘటనను లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉందన్నారు. నిందితుడు శ్రీనివాస్ దాడి కావాలని చేశాడా..?వేరేవారెవరైనా చేయించారా..? ఏదైనా కుట్ర దాగి ఉందా అనేది పోలీసులు విచారణలో తేలాల్సి ఉందన్నారు. 

తల్లి విజయమ్మ, సోదరి షర్మిలలు దాడి చేయించారని టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యల్ని పవన్ ఖండించారు. ఎక్కడైనా తల్లి కొడుకుపై దాడి చేయిస్తుందా అంటూ నిలదీశారు. విజయమ్మ, షర్మిలలు తనను ఎన్నో తిట్టారని అలాగని తాను వాళ్లని ఏమీ అనలేదని తెలిపారు. 

జగన్ దాడి అంశంలో లక్ష్మణ రేఖను దాటి టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేశారని అది సరికాదని పవన్ అన్నారు. రాజకీయ జోక్యం లేకుండా విచారణ జరిపి వాస్తవాలు బయటకు తేవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉందని పవన్ చెప్పారు. ప్రజాపోరాట యాత్రలో పోలీసులు తనకు రక్షణ కల్పించకపోవడంతో ఇబ్బంది పడ్డానని తెలిపారు. 

మరోవైపు టీడీపీ కాంగ్రెస్ ల పొత్తు చంద్రబాబు అధికార దాహానికి నిదర్శనమని పవన్ అభిప్రాయపడ్డారు. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ తాను టీడీపీకి మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. అలాంటి కాంగ్రెస్ తో టీడీపీ ఎలా కలుస్తుందని నిలదీశారు. కాంగ్రెస్ తో టీడీపీ కలవడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. తాను ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు యాత్రలు చేస్తున్నానే తప్ప అధికారం కోసం కాదన్నారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

సామాన్యుడితో పవన్ రైలు యాత్ర

చంద్రబాబు సినిమా ప్లాప్ అవ్వడం ఖాయం:పవన్ కళ్యాణ్

click me!