తూ.గో జిల్లాలో ఓఎన్‌జీసీ పైప్‌లైన్ నుండి గ్యాస్ లీకేజీ: భయాందోళనలో స్థానికులు

Published : Jul 10, 2020, 10:44 AM IST
తూ.గో జిల్లాలో ఓఎన్‌జీసీ పైప్‌లైన్ నుండి గ్యాస్ లీకేజీ: భయాందోళనలో స్థానికులు

సారాంశం

తూర్పు గోదావరి జిల్లా పాశర్లపూడి లంకలో ఓఎన్‌జీసీ పైప్‌లైన్ నుండి శుక్రవారం నాడు గ్యాస్ లీకౌతోంది. దీంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పైప్‌లైన్ నుండి గ్యాస్ లీకౌతున్న విషయాన్ని స్థానికులు ఓఎన్‌జీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా పాశర్లపూడి లంకలో ఓఎన్‌జీసీ పైప్‌లైన్ నుండి శుక్రవారం నాడు గ్యాస్ లీకౌతోంది. దీంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పైప్‌లైన్ నుండి గ్యాస్ లీకౌతున్న విషయాన్ని స్థానికులు ఓఎన్‌జీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఈ సమాచారం అందుకొన్న ఓఎన్‌జీసీ అధికారులు గ్యాస్ లీకేజీని అదుపు చేసేందుకు ప్రయత్నాలను ప్రారంభించారు.  గ్యాస్ లీకేజీ అవుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో లైటర్లు, సెల్‌ఫోన్లు ఉపయోగించకూడదని అధికారులు ఆదేశించారు.

గతంలో కూడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓఎన్‌జీసీ పైప్‌లైన్ నుండి గ్యాస్ లీకైన ఘటనలు చోటు చేసుకొన్నాయి. కొన్ని సమయాల్లో పెద్ద ఎత్తున ప్రమాదాలు కూడ చోటుచేసుకొన్నాయి. 

ఈ ఏడాది మే 18వ తేదీన  ఓఎన్‌జీసీ పైప్ లైన్ నుండి గ్యాస్ లీకైంది. ఇదే జిల్లాలోని మలికిపురం మండలంలోని తూర్పుపాలెం గ్రామంలో గ్యాస్ లీకైంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఓఎన్‌జీసీ పైప్ లైన్ నుండి గ్యాస్ లీకైంది. సుమారు నెల రోజుల తర్వాత ఇదే జిల్లాలో మరోసారి పైప్ లైన్ నుండి గ్యాస్ లీకైంది.

 

 

PREV
click me!

Recommended Stories

Venkaiah Naidu Strong Remarks on Freebies: రాజకీయ పార్టీలను జనం ప్రశ్నించాలి | Asianet News Telugu
Jogi Ramesh Serious:ఆమాటలు వెనక్కుతీసుకోపోతే..రాధాకృష్ణకు బుద్ది చెప్పేతీరుతాం | Asianet News Telugu